Kolkata doctor case: మూడుసార్లు వైద్యురాలి పేరెంట్స్కి ఫోన్.. ఒక్కసారి నిజం చెప్పలేదు..
- కోల్కతా వైద్యురాలి ఘటనలో సంచలన విషయాలు..
- ఘటన తర్వాత తల్లిదండ్రులకు మూడు సార్లు ఆస్పత్రి నుంచి ఫోన్..
- ప్రతీసారి ఆత్మహత్య అంటూ అబద్ధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata doctor case: కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై యావత్ దేశంలో డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళనలు, నిరసనలు తెలియజేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు, మమతా బెనర్జీ సర్కార్ విఫలమైందని కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించింది. నిందితుడు సంజయ్ రాయ్ తన నేరాన్ని సీబీఐ ముందు ఒప్పుకున్నాడు.
అయితే, ఈ ఘటనలో ఆర్ జీ కర్ ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై, ఆ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికే ఇతడిని సీబీఐ వరసగా మూడు రోజుల పాటు ప్రశ్నించింది. ఘటన జరిగిన తర్వాత వైద్యురాలి తల్లిదండ్రులకు మూడుసార్లు ఆస్పత్రి నుంచి ఫోన్ వెళ్లింది. అయితే, ఏ ఒక్కసారి కూడా వారికి నిజాన్ని చెప్పలేదని తెలిసింది. ప్రతీసారి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు తప్పితే ఆమెపై అత్యాచారం జరిగి హత్యకు గురైందనే విషయాన్ని దాచేశారు.
Also Read
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
Read Also: Hurun India List: “ఆసియా బిలియనీర్ల రాజధాని”గా ముంబై.. బెంగళూర్ని దాటేసిన హైదరాబాద్..
మొదటికాల్లో ఆర్జీ కర్ హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ పేరెంట్స్కి ఫోన్ చేసి వారిని వెంటనే రావాల్సిందిగా ‘‘మీ కుమార్తె బాగా లేదు, దయచేసి ఆస్పత్రికి రాగలరా..?’’అని అడిగాడు. డాక్టర్ తండ్రి ఏదో తప్పు జరిగిందని గ్రహించి మరిన్ని వివరాలు అడగటంతో దానికి అతను ‘‘ఆమె బాగాలేదు, మేము ఆమెను అడ్మిట్ చేశాం, నువ్వు త్వరగా రాగలావా..?’’ అని అన్నాడు. మరింత సమాచారం అడిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు చెబుతారంటూ ఫోన్ పెట్టేశాడు.
రెండవ కాల్లో అదే ఆస్పత్రి నుంచి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ..‘‘ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. దయచేసి వీలైనంత త్వరగా రండి’’ అని కోరారు. ఈ కాల్లో కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితిని వైద్యులు వివరిస్తారని చెప్పారు.
మూడో కాల్లో సిబ్బంది చాలా ఆందోళనతో ఫోన్ చేసి.. ‘‘ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు. ఆమె మరణించి ఉండొచ్చు. పోలీసులు ఇక్కడే ఉన్నారు. అందరి ముందే ఈ కాల్ చేస్తున్నాం’’ అని వైద్యురాలి తల్లిదండ్రులకు చెప్పారు. ఈ ఘటన తర్వాత ఆస్పత్రికి వచ్చిన తల్లిదండ్రుల్ని మూడు గంటల పాటు బయటే ఉండేలా చేయడం, ఆ తర్వాతే బాధితురాలి మృతదేహాన్ని చూపించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ దారుణమైన సంఘటనని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!