Shashi Tharoor: మోడీపై శశి థరూర్ ప్రశంసలు.. చిక్కుల్లో రాహుల్ గాంధీ..
- మోడీపై శశి థరూర్ ప్రశంసలు..
- భారత నావికుల రక్షణను ట్రంప్ ముందు ప్రస్తావించారన్న ఎంపీ..
- ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్కు ఇబ్బందికర పరిస్థితులు..
- రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: ప్రధాని నరేంద్రమోడీపై, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోడీ, ట్రంప్ మధ్య జరిగిన భేటీపై థరూర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో, భారత నావికుల భద్రతా అంశాన్ని మోడీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారని థరూర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేసింది.
జీ7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్లో మోడీ-ట్రంప్ సమావేశం జరిగింది. గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తు్న్న భారత నావికుల భద్రతపై మోడీ ఆందోళన వ్యక్తం చేసినట్లు థరూర్ అన్నారు. యుద్ధ పరిస్థితుల్లో నావికులను టార్గెట్ చేయడం సరికాదని మోడీ స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు. ‘‘ నావికులు సైనికులు కారు. యుద్ధ సమయంలో వారిని లక్ష్యంగా చేసుకోవద్దని మోడీ ట్రంప్కు చెప్పారు’’ అని థరూర్ అన్నారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా దాడి వల్ల ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. అయితే, ఈ ఘటనపై ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో థరూర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read
- Pakistan: పాకిస్తాన్ పరువు తీసిన అమెరికా ఉపాధ్యక్షుడు..
- NEET Aspirant Suicide: మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. చివరి వీడియోలో భావోద్వేగ మాటలు..
- Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
ఈ వ్యాఖ్యల్ని బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. థరూర్ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ వైఖరిని బహిర్గతం చేశాయని అన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో మోడీ ముందుంటారని, కానీ రాహుల్ గాంధీ మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని ఫైర్ అయ్యారు. దాదాపు 16 నెలల తర్వాత, ఫ్రాన్స్ జీ7 సదస్సు వేదికగా ట్రంప్, మోడీ భేటీ అయ్యారు. ఈ సమయంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం గురించి ప్రస్తావించారు. నావికుల భద్రతను ట్రంప్ ముందు మోడీ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Shashi Tharoor: మోడీపై శశి థరూర్ ప్రశంసలు.. చిక్కుల్లో రాహుల్ గాంధీ..
-
Prabhas: ప్రభాస్ మొబైల్ వాల్పేపర్ లీక్.. డార్లింగ్ ఫోన్ స్క్రీన్పై అదిరిపోయే ఫోటో!
-
Parastoo Ahmadi : హిజాబ్ ధరించలేదని గాయనిపై అరాచకం.. ఏకంగా 74 కొరడా దెబ్బల శిక్ష!
-
Pakistan: పాకిస్తాన్ పరువు తీసిన అమెరికా ఉపాధ్యక్షుడు..
-
Bangladesh: బంగ్లాదేశ్లో మార్మోగిన ‘‘జై శ్రీరాం’’ నినాదాలు.. ఢాకాలో హిందువుల భారీ ర్యాలీ..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!