NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు..
- విలీనం దిశగా ఎన్సీపీ వర్గాలు..
- విలీనం తర్వాత ఎన్డీయే కూటమిలోకి శరద్ పవార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శరద్ పవార్ ఎన్సీపీ వర్గం, సునేత్రా పవార్ ఎన్సీపీ వర్గం కలిసిపోయే అవకావాలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ రెండు వర్గాల విలీనం కావాలని బీజేపీ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. తెరవెనర బీజేపీ వేగంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శరద్ పవార్ వర్గాన్ని ప్రత్యేక పార్టీగా గుర్తించి ఎన్డీయే కూటమిలో చేర్చుకోవడం బీజేపీకి ఇష్టం లేదని సమాచారం. దీని వల్లే ముందు రెండు వర్గాలు ఒక్కటిగా కలిసిపోవాలని బీజేపీ ఆకాంక్షిస్తోంది. ఇదే సమయంలో ఎన్సీపీ(శరద్ పవార్) వర్గాన్ని బీజేపీలో విలీనం చేసుకునే ఆలోచన లేదని సమాచారం.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ, శివసేన పార్టీల చీలిక తర్వాత బీజేపీ బలీయమైన శక్తిగా మారింది. ఇదే సమయంలో ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీని ఎన్డీయేలో చేర్చుకుంటే మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని దెబ్బతీసినట్లు అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇదే సమయంలో రెండు ఎన్సీపీ వర్గాలు కలిస్తే రెండు వర్గాలకు ఒక్కో కేంద్ర మంత్రి పదవి ఇవ్వడాన్ని కమలం పార్టీ పరిశీలిస్తోంది.
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
ఇదిలా ఉంటే, ఎన్డీయే సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ‘‘డీలిమిటేషన్ బిల్లు’’ కోసం కసరత్తు చేస్తోంది. ఈ బిల్లు ఆమోదానికి లోక్సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. ఆ సంఖ్యా బలం కోసం వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరిస్తోంది. ప్రస్తుతం శరద్ పవార్ ఎన్సీపీకి 8 మంది లోక్సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. ఈ మద్దతు ఎన్డీయే కూటమికి ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు బీజేపీకి బిల్లు విషయంలో మద్దతు ఇస్తామంటూ సుప్రియా సూలే హింట్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెరిగితే తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ శరద్ పవార్ కుమార్తె చెప్పడం గమనార్హం.
మరోవైపు, మహారాష్ట్రలో రహస్య భేటీలు జరుగుతున్నాయి. శరద్ పవార్ ఇటీవల డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను కలిశారు. ఎన్సీపీ రెండు వర్గాల నేతలు కూడా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ వర్గం నేత జయంత్ పాటిల్ కూడా ఫడ్నవీస్ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీలో నాయకత్వ పోటీ పెరిగింది.
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!