NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు..
- విలీనం దిశగా ఎన్సీపీ వర్గాలు..
- విలీనం తర్వాత ఎన్డీయే కూటమిలోకి శరద్ పవార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శరద్ పవార్ ఎన్సీపీ వర్గం, సునేత్రా పవార్ ఎన్సీపీ వర్గం కలిసిపోయే అవకావాలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ రెండు వర్గాల విలీనం కావాలని బీజేపీ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. తెరవెనర బీజేపీ వేగంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శరద్ పవార్ వర్గాన్ని ప్రత్యేక పార్టీగా గుర్తించి ఎన్డీయే కూటమిలో చేర్చుకోవడం బీజేపీకి ఇష్టం లేదని సమాచారం. దీని వల్లే ముందు రెండు వర్గాలు ఒక్కటిగా కలిసిపోవాలని బీజేపీ ఆకాంక్షిస్తోంది. ఇదే సమయంలో ఎన్సీపీ(శరద్ పవార్) వర్గాన్ని బీజేపీలో విలీనం చేసుకునే ఆలోచన లేదని సమాచారం.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ, శివసేన పార్టీల చీలిక తర్వాత బీజేపీ బలీయమైన శక్తిగా మారింది. ఇదే సమయంలో ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీని ఎన్డీయేలో చేర్చుకుంటే మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని దెబ్బతీసినట్లు అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇదే సమయంలో రెండు ఎన్సీపీ వర్గాలు కలిస్తే రెండు వర్గాలకు ఒక్కో కేంద్ర మంత్రి పదవి ఇవ్వడాన్ని కమలం పార్టీ పరిశీలిస్తోంది.
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
- Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్కు తిరుగులేదు..
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
ఇదిలా ఉంటే, ఎన్డీయే సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ‘‘డీలిమిటేషన్ బిల్లు’’ కోసం కసరత్తు చేస్తోంది. ఈ బిల్లు ఆమోదానికి లోక్సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. ఆ సంఖ్యా బలం కోసం వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరిస్తోంది. ప్రస్తుతం శరద్ పవార్ ఎన్సీపీకి 8 మంది లోక్సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. ఈ మద్దతు ఎన్డీయే కూటమికి ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు బీజేపీకి బిల్లు విషయంలో మద్దతు ఇస్తామంటూ సుప్రియా సూలే హింట్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెరిగితే తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ శరద్ పవార్ కుమార్తె చెప్పడం గమనార్హం.
మరోవైపు, మహారాష్ట్రలో రహస్య భేటీలు జరుగుతున్నాయి. శరద్ పవార్ ఇటీవల డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను కలిశారు. ఎన్సీపీ రెండు వర్గాల నేతలు కూడా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ వర్గం నేత జయంత్ పాటిల్ కూడా ఫడ్నవీస్ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీలో నాయకత్వ పోటీ పెరిగింది.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?