Maharashtra: శరద్ పవార్ పార్టీకి షాక్! మహాయుతి వైపు చూస్తున్న ఎంపీలు!
- శరద్ పవార్ పార్టీకి షాక్!
- మహాయుతి వైపు చూస్తున్న ఎంపీలు!
- కొట్టిపారేసిన శరద్ పవార్ పార్టీ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన శరద్ పవార్ పార్టీకి మరో షాక్ తగిలేటట్టు కనిపిస్తోంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలు.. మహాయుతి కూటమిలోకి వెళ్లేపోయే సూచనలు కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ నేత వ్యాఖ్యానించారు. మహా వికాస్ అఘాడీ నుంచి చాలా మంది ఎంపీలు, ముఖ్యంగా NCP (SP) పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు మహాయుతి వైపు చూస్తు్న్నారని బీజేపీ నాయకుడు ప్రవీణ్ దారేకర్ బుధవారం వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొంత మంది ఎంపీలు టచ్లోకి వచ్చారని పేర్కొన్నారు. త్వరలోనే చేరికలు ఉండొచ్చని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Mohammed Shami Double Century: టి20లో ‘డబుల్ సెంచరీ’ పూర్తి చేసిన మహ్మద్ షమీ.. ఎలాగంటే?
Also Read
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
అభివృద్ధి కోసం, రాజకీయ భవిష్యత్ కోసం పార్టీలు మారడం సహజమేనని ప్రవీణ్ దారేకర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరించారు. ఇదిలా ఉంటే దారేకర్ వ్యాఖ్యలను ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు విద్యా చవాన్ తోసిపుచ్చారు. మిత్రపక్షాల మద్దతు కోల్పోయే భయంతో బీజేపీ.. ప్రతిపక్ష నాయకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నితీష్ కుమార్, చంద్రబాబు మద్దతుతో నడుస్తోందని.. వారు మద్దతు ఉపసంహరించుకుంటారేమోనన్న భయంతో ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు గాలం వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎంపీలు ఎలాంటి ప్రలోభాలకు గురికారని చెప్పుకొచ్చారు. ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీలు దృఢంగా ఉన్నారని, సంకీర్ణానికి ద్రోహం చేయరని విద్యా చవాన్ తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Manchu : మూడు రోజుల తర్వాత మోహన్ బాబు ఇంటివద్ద ప్రశాంత వాతావరణం..
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి 235 స్థానాలు గెలుచుకుంది. మహా వికాస్ అఘాడీ కూటమి 50 స్థానాలకే పరిమితమైంది. ఇక బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, కాంగ్రెస్ 16, ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, శరద్ పవార్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. ముఖ్యమంత్రి స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మోయ్ కృష్ణదాస్కి మరోసారి బెయిల్ నిరాకరించిన బంగ్లా కోర్టు..
తాజావార్తలు
-
Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
-
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ నుంచి క్రేజీ లీక్ వైరల్!
-
Sunil Narine: ఇంకా చాలా మ్యాచ్లు ఆడాలని ఉంది.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేకేఆర్ స్టార్ సునీల్ నరైన్!
-
Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
-
RaviMohan : జయంరవి చెప్పిన మూడక్షరాల ఇడ్లి నటి ఆమేనా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..