Maharashtra: ‘‘దిశ సాలియన్పై ఆదిత్య ఠాక్రే అత్యాచారం చేశాడని చెప్పాలి’’.. మహా రాజకీయాల్లో ప్రకంపనలు..
- మహారాష్ట్రలో సంచలనంగా అనిల్ దేశ్ముఖ్ ఆరోపణలు..
- దేవేంద్ర ఫడ్నవీస్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు..
- దిశాసాలియన్ని ఆదిత్య ఠాక్రే రేప్ చేశాడని చెప్పాలని బలవంతం..
- ఖండించిన ఫడ్నవీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ టార్గెట్గా ఆయన పలు ఆరోపణలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు, ఫడ్నవీస్ తనను తప్పుడు అఫిడవిట్ సమర్పించాలని ఒత్తిడి తీసుకువచ్చారని అనిల్ దేశ్ముఖ్ ఆరోపించారు. అప్పటి మంత్రులు ఆదిత్య ఠాక్రే, అజిత్ పవార్లతో పాటు అనిల్ పరాబ్లపై రాతపూర్వక ఆరోపణలు చేయాలని తనను కోరినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు చేస్తే తనపైకి ఈడీ, సీబీఐ రాదని ఫడ్నవీస్ చెప్పిటన్లు దేశ్ముఖ్ పేర్కొన్నారు. అయితే, తాను జీవితాంతం జైలుకు వెళ్లాల్సి వచ్చినా కూడా ఆరోపణలు చేయనని చెప్పానని, తాను తలవంచలేదని చెప్పారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో, ఆత్మహత్య చేసుకుని మరణించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో, ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్య కేసులో అప్పటి మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, వీటిపై కూడా అనిల్ దేశ్ముఖ్ స్పందించారు. దిశా సాలియన్పై ఆదిత్యఠాక్రే అత్యాచారం చేసి, ఆమెను బాల్కనీ నుంచి తోసేశాడని ఆరోపించాలని, తప్పుడు అఫిడవిట్ ఇవ్వాలని ఒక మధ్యవర్తి తనను కోరాడని ఆయన పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
Read Also: Fertility: IVF సెంటర్లకు పరుగుపెడుతున్న భారతీయులు.. పడిపోతున్న సంతానోత్పత్తి రేటు.. కారణాలేంటి..?
వసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీల ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వంలో అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర హోం మంత్రిగా పనిచేశారు. ముంబైలోని హోటల్, బార్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేయమని పోలీసు అధికారుల్ని ఆదేశించారని అప్పటి ముంబై కమిషనర్ ఆరోపించడంతో అనిల్ దేశ్ముఖ్ 2021లో తన హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 2021లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయగా, ఏప్రిల్ 2022లో అవినీతి కేసులో సీబీఐ చేత అరెస్ట్ చేయబడ్డాడు.
అయితే, ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. అవన్నీ నిరాధారమైనవని ఖండించారు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లపై దేశ్ముఖ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అనేక వీడియోలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఆ వీడియోలను బహిరంగపరచడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. దేశ్ముఖ్కి చెందిన ఆధారాలనపు ఫడ్నవీస్ బయటపెట్టాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఆందోళనకు దిగారు. దేశ్ముఖ్ చెప్పేదే నిజం కావచ్చు, ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని పటోలే చెప్పారు.
తాజావార్తలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!