Sharad Pawar: మహారాష్ట్ర పరాజయానికి ఈవీఎంలే కారణం, కానీ ఆధారాల్లేవు..
- ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలే కారణం..
- కానీ అందుకు ఆధారాలు లేవు..
- మహారాష్ట్ర ఓటమిపై శరద్ పవార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ’’ అత్యంత దారుణంగా ఓడిపోయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, శివసేన(ఠాక్రే), శరద్ పవార్(ఎన్సీపీ)లు కేవలం 46 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండే శివసేనల ‘‘మహాయుతి’’ కూటమి 233 స్థానాలను గెలుచుకుంది. ఒక్క బీజేపీనే 132 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి తీవ్ర నిరాశలో ఉంది. ఇలాంటి ఫలితాలు రావడానికి ఎన్నికల్లో అక్రమాలు, ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే తమ అనుమానాలపై ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే, తాజాగా శరద్ పవార్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంఎస్) ద్వారా నమోదైన ఓట్లలో అవకతవకలు జరిగాయని శరద్ పవార్ ఆరోపించారు.
Also Read
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Read Also: Safety Tips: గీజర్ను సరిగ్గా వాడకపోతే ప్రాణానికే ప్రమాదం.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..?
‘‘ఈవీఎంల ఓట్లలో కొంత వ్యత్యాసం ఉంది, కానీ ప్రస్తుతానికి దీనికి సంబంధించి నా వద్ద ఎటువంటి రుజువు లేదు, కొంతమంది రీకౌంటింగ్ కోరారు, ఈ విషయంలో ఏది సాధ్యమైతే అది చేస్తాను. కొంతమంది రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ఏం జరుగుతుందో చూద్ధాం, కానీ దీని గురించి నాకు పెద్దగా ఆశ లేదు’’ అన్నారు.’’ అని అన్నారు. ‘‘ఇది మొదటిసారి జరిగింది. దేశంలో జరిగిన ఎన్నికలు ప్రజల్ని చాలా అశాంతికి గురిచేశాయి. ప్రజల్లో నిరాశ ఉంది’’అని కేంద్రాన్ని విమర్శి్ంచారు.
ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లో అడిగే ప్రశ్నలను పట్టించుకోవడం లేదని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా పాటించడం లేదని దీనివల్ల స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మంచిది కాదని, ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కాంగ్రెస్ ఆరోపణల్ని కొట్టిపారేసింది. చర్చల కోసం కాంగ్రెస్ పార్టీ బృందాన్ని డిసెంబర్ 03న ఈసీ ఆహ్వానించింది.
తాజావార్తలు
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!