Sharad Pawar: మహారాష్ట్ర పరాజయానికి ఈవీఎంలే కారణం, కానీ ఆధారాల్లేవు..
- ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలే కారణం..
- కానీ అందుకు ఆధారాలు లేవు..
- మహారాష్ట్ర ఓటమిపై శరద్ పవార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ’’ అత్యంత దారుణంగా ఓడిపోయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, శివసేన(ఠాక్రే), శరద్ పవార్(ఎన్సీపీ)లు కేవలం 46 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండే శివసేనల ‘‘మహాయుతి’’ కూటమి 233 స్థానాలను గెలుచుకుంది. ఒక్క బీజేపీనే 132 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి తీవ్ర నిరాశలో ఉంది. ఇలాంటి ఫలితాలు రావడానికి ఎన్నికల్లో అక్రమాలు, ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే తమ అనుమానాలపై ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే, తాజాగా శరద్ పవార్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంఎస్) ద్వారా నమోదైన ఓట్లలో అవకతవకలు జరిగాయని శరద్ పవార్ ఆరోపించారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Safety Tips: గీజర్ను సరిగ్గా వాడకపోతే ప్రాణానికే ప్రమాదం.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..?
‘‘ఈవీఎంల ఓట్లలో కొంత వ్యత్యాసం ఉంది, కానీ ప్రస్తుతానికి దీనికి సంబంధించి నా వద్ద ఎటువంటి రుజువు లేదు, కొంతమంది రీకౌంటింగ్ కోరారు, ఈ విషయంలో ఏది సాధ్యమైతే అది చేస్తాను. కొంతమంది రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ఏం జరుగుతుందో చూద్ధాం, కానీ దీని గురించి నాకు పెద్దగా ఆశ లేదు’’ అన్నారు.’’ అని అన్నారు. ‘‘ఇది మొదటిసారి జరిగింది. దేశంలో జరిగిన ఎన్నికలు ప్రజల్ని చాలా అశాంతికి గురిచేశాయి. ప్రజల్లో నిరాశ ఉంది’’అని కేంద్రాన్ని విమర్శి్ంచారు.
ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లో అడిగే ప్రశ్నలను పట్టించుకోవడం లేదని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా పాటించడం లేదని దీనివల్ల స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మంచిది కాదని, ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కాంగ్రెస్ ఆరోపణల్ని కొట్టిపారేసింది. చర్చల కోసం కాంగ్రెస్ పార్టీ బృందాన్ని డిసెంబర్ 03న ఈసీ ఆహ్వానించింది.
తాజావార్తలు
-
Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
-
Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
-
PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
-
NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!