Sharad Pawar: మహారాష్ట్ర పరాజయానికి ఈవీఎంలే కారణం, కానీ ఆధారాల్లేవు..
- ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలే కారణం..
- కానీ అందుకు ఆధారాలు లేవు..
- మహారాష్ట్ర ఓటమిపై శరద్ పవార్..
Sharad Pawar: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ’’ అత్యంత దారుణంగా ఓడిపోయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, శివసేన(ఠాక్రే), శరద్ పవార్(ఎన్సీపీ)లు కేవలం 46 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండే శివసేనల ‘‘మహాయుతి’’ కూటమి 233 స్థానాలను గెలుచుకుంది. ఒక్క బీజేపీనే 132 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి తీవ్ర నిరాశలో ఉంది. ఇలాంటి ఫలితాలు రావడానికి ఎన్నికల్లో అక్రమాలు, ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే తమ అనుమానాలపై ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే, తాజాగా శరద్ పవార్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంఎస్) ద్వారా నమోదైన ఓట్లలో అవకతవకలు జరిగాయని శరద్ పవార్ ఆరోపించారు.
Also Read
Read Also: Safety Tips: గీజర్ను సరిగ్గా వాడకపోతే ప్రాణానికే ప్రమాదం.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..?
‘‘ఈవీఎంల ఓట్లలో కొంత వ్యత్యాసం ఉంది, కానీ ప్రస్తుతానికి దీనికి సంబంధించి నా వద్ద ఎటువంటి రుజువు లేదు, కొంతమంది రీకౌంటింగ్ కోరారు, ఈ విషయంలో ఏది సాధ్యమైతే అది చేస్తాను. కొంతమంది రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ఏం జరుగుతుందో చూద్ధాం, కానీ దీని గురించి నాకు పెద్దగా ఆశ లేదు’’ అన్నారు.’’ అని అన్నారు. ‘‘ఇది మొదటిసారి జరిగింది. దేశంలో జరిగిన ఎన్నికలు ప్రజల్ని చాలా అశాంతికి గురిచేశాయి. ప్రజల్లో నిరాశ ఉంది’’అని కేంద్రాన్ని విమర్శి్ంచారు.
ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లో అడిగే ప్రశ్నలను పట్టించుకోవడం లేదని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా పాటించడం లేదని దీనివల్ల స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మంచిది కాదని, ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కాంగ్రెస్ ఆరోపణల్ని కొట్టిపారేసింది. చర్చల కోసం కాంగ్రెస్ పార్టీ బృందాన్ని డిసెంబర్ 03న ఈసీ ఆహ్వానించింది.
తాజావార్తలు
-
Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి
-
Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి
-
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!