Swami Avimukteshwaranand: “మేం మోడీ ఆరాధకులం”.. విమర్శించిన శంకరాచార్య నోటి నుంచి పొగడ్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swami Avimukteshwaranand: రామ మందిర ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. హిందువులను జాగృతం చేయడం చిన్న విషయం కాదని, అది ప్రధాని నరేంద్రమోడీ వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. ఇతనే కొన్ని రోజుల క్రితం రామ మందిర నిర్మాణం అసంపూర్తిగా ఉందని, తాను ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ప్రకటించారు.
ప్రధాని మోడీ హిందువుల ఆత్మగౌరవం గురించి తెలుసుకున్నందున తాను ప్రధాని నరేంద్రమోడీని ఆరాధించేవారిలో ఒకరినని శంకరాచార్య అన్నారు. మేం మోడి వ్యతిరేకుల కాదని, ఆరాధకులమని, మేము చాలా సార్లు ఇదే విషయాన్ని చెప్పామని గుర్తు చేశారు. మోడీకి ముందు హిందువులను ఇంతగా ఐక్యం చేసిన ప్రధాని ఎవరూ లేరని ఆయన అన్నారు. మనకు చాలా మంది ప్రధానులు ఉన్నారు, వారంతా మంచి వారని, మేం వారిని విమర్శించడం లేదని శంకరాచార్య అన్నారు. ప్రధాని మోదీలా హిందువులను మేల్కొల్పినట్లు మరే ప్రధాని లేరని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ప్రశంసలు కురిపించారు.
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
Read Also: Mahashakti Temple : రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట.. ముస్తాబైన కరీంనగర్ మహా శక్తి ఆలయం
ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు, పౌరసత్వ సవరణ చట్టం వచ్చినప్పుడు మేం స్వాగతించామని, మోడీ స్వచ్ఛతా అభియాన్ మేము అడ్డుకున్నామా..? అని ప్రశ్నించారు. రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగనందుకు ప్రశంసించాము, హిందువులు బలపడినప్పుడల్లా మేము సంతోషంగా ఉన్నామని, ప్రధాని మోడీ ఆ పనిని చేస్తున్నారని శంకరాచార్య అన్నారు.
రేపు జరగబోయే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలకు నలుగురు శంకరాచార్యులు రావడం లేదని చెప్పడంతో వివాదం చెలరేగింది. భగవంతుడి దేహంగా ఆలయం భావించబడుతుందని, అది అసంపూర్తిగా ఉందని, అందువల్ల కొత్త విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేయడం సరికాదని స్వామి అవిముక్తేశ్వరానంద అన్నారు.
తాజావార్తలు
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!