Swami Avimukteshwaranand: “మేం మోడీ ఆరాధకులం”.. విమర్శించిన శంకరాచార్య నోటి నుంచి పొగడ్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swami Avimukteshwaranand: రామ మందిర ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. హిందువులను జాగృతం చేయడం చిన్న విషయం కాదని, అది ప్రధాని నరేంద్రమోడీ వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. ఇతనే కొన్ని రోజుల క్రితం రామ మందిర నిర్మాణం అసంపూర్తిగా ఉందని, తాను ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ప్రకటించారు.
ప్రధాని మోడీ హిందువుల ఆత్మగౌరవం గురించి తెలుసుకున్నందున తాను ప్రధాని నరేంద్రమోడీని ఆరాధించేవారిలో ఒకరినని శంకరాచార్య అన్నారు. మేం మోడి వ్యతిరేకుల కాదని, ఆరాధకులమని, మేము చాలా సార్లు ఇదే విషయాన్ని చెప్పామని గుర్తు చేశారు. మోడీకి ముందు హిందువులను ఇంతగా ఐక్యం చేసిన ప్రధాని ఎవరూ లేరని ఆయన అన్నారు. మనకు చాలా మంది ప్రధానులు ఉన్నారు, వారంతా మంచి వారని, మేం వారిని విమర్శించడం లేదని శంకరాచార్య అన్నారు. ప్రధాని మోదీలా హిందువులను మేల్కొల్పినట్లు మరే ప్రధాని లేరని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ప్రశంసలు కురిపించారు.
Also Read
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
Read Also: Mahashakti Temple : రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట.. ముస్తాబైన కరీంనగర్ మహా శక్తి ఆలయం
ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు, పౌరసత్వ సవరణ చట్టం వచ్చినప్పుడు మేం స్వాగతించామని, మోడీ స్వచ్ఛతా అభియాన్ మేము అడ్డుకున్నామా..? అని ప్రశ్నించారు. రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగనందుకు ప్రశంసించాము, హిందువులు బలపడినప్పుడల్లా మేము సంతోషంగా ఉన్నామని, ప్రధాని మోడీ ఆ పనిని చేస్తున్నారని శంకరాచార్య అన్నారు.
రేపు జరగబోయే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలకు నలుగురు శంకరాచార్యులు రావడం లేదని చెప్పడంతో వివాదం చెలరేగింది. భగవంతుడి దేహంగా ఆలయం భావించబడుతుందని, అది అసంపూర్తిగా ఉందని, అందువల్ల కొత్త విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేయడం సరికాదని స్వామి అవిముక్తేశ్వరానంద అన్నారు.
తాజావార్తలు
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!