Rahul Gandhi: హిందుత్వ హింసపై వివాదం.. రాహుల్కు మద్దతుగా జ్యోతిర్ మఠం శంకరాచార్య..!
- హిందుత్వాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టలేదు..
- హిందూ మతంలో హింసకు తావులేదని రాహుల్ సరిగ్గానే చెప్పారు..
- రాహుల్ ప్రసంగాన్ని ఎడిట్ చేసి వైరల్ చేసిన వాళ్లను శిక్షించాలి: జ్యోతిర్ మఠం శంకరాచార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ లో ఇటీవల చేసిన హిందుత్వ హింస కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఉత్తరాఖండ్ లోని జ్యోతిర్ మఠం 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. హిందుత్వాన్ని తప్పుబట్టేలా రాహుల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. హిందూ మతంలో హింసకు తావులేదని రాహుల్ సరిగ్గానే చెప్పారు.. అతడి ప్రసంగంలోని వ్యాఖ్యలను ఎడిట్ చేసి అర్ధ సత్యాలు ప్రచారం చేశారన్నారు. అలాంటి వ్యక్తులను కఠింగా శిక్షించాలని అవిముక్తేశ్వరానంద స్వామి డిమాండ్ చేశారు.
Read Also: Instagram Reels: అయ్యిందా బాగా అయ్యిందా.. ఇప్పుడు చల్లు రోడ్డుపై నోట్లు..
Also Read
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
అయితే, రాహుల్ గాంధీ ప్రసంగంలోని ‘హింసాత్మక’ వ్యాఖ్యలు కేంద్రంలోని ఓ పార్టీని ఉద్దేశించి చేసినవే తప్ప హిందుత్వం గురించి కాదని జ్యోతిర్ మఠం శంకరాచార్య స్వామి తేల్చి చెప్పారు. దీనిపై రాహుల్ కూడా వివరణ ఇచ్చారు.. మతం ముసుగులో హింసను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీని ఉద్దేశించే తాను ఆ కామెంట్స్ చేసినట్లు చెప్పారని స్వామిజీ గుర్తు చేశారు.
Read Also: PekaMedaluTrailer: వెధవ పనులు చేసేటప్పుడు పది మందికి తెలియకుండా చేయాలి..
కాగా, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ నెల 2వ తేదీన జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు దేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తున్నారని ఆరోపణలు చేశారు. తమను తాము హిందువులమని చెప్పుకొనే కొందరు 24 గంటలూ హింస, ధ్వేషం, అసత్యం గురించే మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా అధికార పార్టీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. దేశంలోని హిందువులందరినీ హింసకు పాల్పడే వారిగా రాహుల్ అవమానించారంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో రాహుల్ గాంధీ ప్రసంగంలోని ఆ భాగాన్ని స్పీకర్ ఓం బీర్లా రికార్డుల నుంచి తొలగించింది.
नेता विपक्ष राहुल गांधी के संसद में हिंदू वाले बयान पर ज्योतिष पीठ के शंकराचार्य अविमुक्तेश्वरानंद सरस्वती को सुनिए pic.twitter.com/0p35TOivHT
— Lutyens Media (@LutyensMediaIN) July 7, 2024
తాజావార్తలు
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!