PM Modi: “సందేశ్ఖాలీ” బాధితురాలు, ఎంపీ అభ్యర్థి రేఖా పాత్రకి ప్రధాని మోడీ ఫోన్.. “శక్తి స్వరూపిణి” అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు సందేశ్ఖాలీ బాధితురాలు, బీజేపీ తరుపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేఖా పాత్రకి ఫోన్ చేసి మాట్లాడారు. బసిర్హత్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమెను బీజేపీ తన అభ్యర్థిగా రంగంలోకి దింపింది. సందేశ్ఖాలీలో ప్రజల మానసిక పరిస్థితి గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. రేఖా పాత్రను ‘శక్తి స్వరూపిణి’గా ప్రధాని మోడీ అభివర్ణించారు. సందేశ్ఖాలీ ప్రాంత మహిళల బాధల్ని, తృణమాల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకులు వేధింపుల గురించి రేఖ ప్రధానికి తెలిపారు.
‘‘ మీరు సందేశ్ఖాలీలో పెద్ద యుద్ధం చేశారు. నువ్వు శక్తి స్వరూపానివి. శక్తివంతమైన నేతను జైలుకు పంపారు. సందేశ్ఖాలీలోని మహిళల గొంతు ఎత్తడం సాధారణ విషయం కాదు. బెంగాల్లోని నారీ శక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని మీ ధైర్యం తెలియజేస్తుంది. కేంద్రం చేసిన పనుల గురించి ప్రజలకు తెలియజేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. బెంగాల్లోని టిఎంసి ప్రభుత్వం వల్ల ప్రజలు విసిగిపోయారు, ఇది రాష్ట్రంలో కేంద్ర పథకాలను అమలు చేయనివ్వదు,’’ అని ప్రధాని మోడీ రేఖ పాత్రను ప్రశంసించారు. దీనికి రేఖ బదులిస్తూ..‘‘ మహిళల మద్దతుతో దీనిని నేను చేయగలిగాను, నేను వారు చూపిన మార్గంలో నడుస్తాను, అందర్ని వెంట తీసుకెళుతాను’’ అని అన్నారు. శక్తి అనే పదం దుర్గా, కాళీ వంటి దేవతలతో ముడిపడి ఉంది.
Also Read
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
Read Also: Kejriwal: అరెస్ట్పై కేజ్రీవాల్ పిటిషన్.. విచారణ ఎప్పుడంటే..!
లోక్సభ ఎన్నికల ముందు తృణమూల్ నేతలు సందేశ్ఖాలీ మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలోని మహిళలు టీఎంసీ నేతలు, మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఎత్తున నిరసనలు చేయడంతో ఒక్కసారిగా ఈ ప్రాంత పేరు దేశరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మహిళా ఉద్యమంలో రేఖాపాత్ర కీలకంగా వ్యవహరించారు. సందేశ్ ఖాలీ ప్రాంతం బసిర్హాట్ ఎంపీ పరిధి కిందకు వస్తుంది, దీనికి బీజేపీ తన ఎంపీ అభ్యర్థిగా రేఖా పాత్రను ఎంచుకుంది.
తృణమూల్ మాజీ స్ట్రాంగ్ లీడర్ షేక్ షాజహాన్, అతని అనుచరులు సందేశ్ఖాలీ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో షాజహాన్ భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. నెల క్రితం రేషన్ కుంభకోణంలో విచారణకు వెళ్లిన ఈడీ అధికారులపై షేక్ షాజహాన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి 55 రోజులు పరారీలో ఉన్న అతడిని, కలకత్తా హైకోర్టు అల్టిమేటంతో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతనిపై ఉన్న కేసుల్ని సీబీఐ విచారిస్తోంది.
- Tags
- bjp
- PM Modi
- Rekha Patra
- Sandeshkhali
- TMC
తాజావార్తలు
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!