పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. కోల్కతాలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో హాజరైన ప్రజలు, పోలీసులు గాయాలు పాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
బుధవారం నటుడు ఉత్తమ్ కుమార్ 44వ వర్ధంతి సందర్భంగా కోల్కతా ధనధాన్య ఆడిటోరియంలో నిర్వాహకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్కి సీఎం మమత హాజరయ్యారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆడిటోరియం దగ్గర నిర్వాహకులు తాత్కాలికంగా గేట్ ఏర్పాటు చేశారు. ఇది హఠాత్తుగా కూలిపోయింది. దీంతో ప్రజలు, పోలీసులు గాయపడ్డారు. కొందరు స్పృహతప్పి పడిపోయారు. పోలీసులు సహాయ చర్యలు చేపట్టి.. ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూాడా చదవండి: Drugs Positive: ఇదేందయ్యా ఇది.. సొరచేపలకు ‘డ్రగ్స్ పాజిటివ్’