Heavy Rains: ఉత్తరాదిన దంచికొడుతున్న వానలు.. పెరుగుతున్న మరణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఢిల్లీలో వరసగా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధానిలో పలు ప్రాంతాల్లో నీరు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించింది.
Read Also: Maharashtra : దారుణం.. భర్తను బందించి మహిళపై సామూహిక అత్యాచారం..
Also Read
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
ఢిల్లీలో ఓ ఫ్లాట్ సీలింగ్ కూలి 58 ఏళ్ల మహిళ మృతి చెందింది. రాజస్థాన్లో 24 గంటల వ్యవధిలో వర్షాల కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు. రాజస్థాన్లోని రాజ్సమంద్, జలోర్, పాలి, అజ్మీర్, అల్వార్, బన్స్వారా, భరత్పూర్, భిల్వారా, బుండి, చిత్తోర్గఢ్, దౌసా, ధౌల్పూర్, జైపూర్, కోట జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అమర్ నాథ్ యాత్ర వరసగా మూడో రోజు నిలిచిపోయింది.
ఇదిలా ఉంటే దక్షిణాదిన కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కేరళలో వర్షాల వల్ల ఇప్పటి వరకు 19 మంది మరణించారని, 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!