Manipur Reopens Schools: మణిపూర్లో పునః ప్రారంభమైన స్కూల్స్.. మొదటి రోజు తక్కువ హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Reopens Schools: మణిపూర్లో జాతుల మధ్య గొడవ కారణంగా హింస మధ్య మూతపడిన పాఠశాలలు బుధవారం పునః ప్రారంభమయ్యాయి. బుధవారం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్కూల్క్ ప్రారంభమయ్యాయి. మొదటి రోజు హాజరు తక్కువగా ఉన్నట్టు పాఠశాలల హెడ్మాష్టర్లు తెలిపారు. మొదటి రోజు హాజరు తక్కువగా ఉన్నప్పటికీ.. పాఠశాలలను పునఃప్రారంభించాలనే నిర్ణయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు స్వాగతించారు. జాతి ఘర్షణల కారణంగా కొన్ని నెలల పాటు మూసివేయబడిన తరువాత బుధవారం మణిపూర్ అంతటా పాఠశాలలు తిరిగి తెరవబడ్డాయి. మొదటి రోజు చాలా విద్యాసంస్థల్లో హాజరు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, తరగతులను పునఃప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. జూలై 5 నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలను పునఃప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
Read also: Balagam Movie: ‘బలగం’కు మరో అరుదైన రికార్డు.. ఏకంగా 100 ఇంటర్నేషనల్ అవార్డులు
Also Read
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
పాఠశాలకు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నామని రెండు నెలల తర్వాత విద్యార్థులు వారి స్నేహితులను మరియు ఉపాధ్యాయులను కలుసుకోగలుగుతున్నామని.. అంతేకాకుండా కొత్త విషయాలను నేర్చుకుంటామని విద్యార్థులు చెబుతున్నారు.
పాఠశాలల మూసివేత తన జీవితాన్ని చాలా పనిలేకుండా మరియు బోరింగ్గా మార్చిందని ఒక ఉపాధ్యాయురాలు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ కనీసం కొన్ని గంటలపాటు పాఠశాలలు తెరిచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. ఒక విద్యార్థి తండ్రి మాట్లాడుతూ తరగతులు కొనసాగించడానికి పరిస్థితి సాధారణంగానే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.విద్య కీలకమని రాష్ట్రంలో శాంతి నెలకొనాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్టు చెప్పారు. అయితే విద్యార్థుల భద్రతపై తనకు కొంత ఆందోళన ఉందన్నారు. ఇంఫాల్ నడిబొడ్డున స్కూల్ ఉంది కాబట్టి తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి తాను భయపడటం లేదని.. కానీ ప్రభుత్వం విద్యార్థుల భద్రత కోసం ఏర్పాట్లు చేస్తే చాలా బాగుంటుందని ఒక విద్యార్థి తండ్రి కోరారు.
Read also: MLA Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అరెస్ట్.. కారణం ఇదే..
వాంగ్ఖీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఆర్కె రంజితా దేవి తరగతులను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యను స్వాగతించారు. మే మొదటి వారం నుండి పాఠశాలలు మూసివేయబడటంతో, చాలా మంది విద్యార్థులు తమ చదువులపై దృష్టి సారించలేకపోయారని.. వారి మనస్సు మళ్ళించబడిందని దేవి చెప్పారు. తమ పాఠశాలలో మొదటి రోజు హాజరు కేవలం 10 శాతం మాత్రమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది పెరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఇంటర్నెట్పై నిషేధం ఉన్నందున, ఆన్లైన్ తరగతులు కూడా సాధ్యం కాదని దేవి చెప్పారు. ఇంటర్నెట్ నిషేధం కారణంగా, ఆన్లైన్ తరగతులు సాధ్యం కాదు కాబట్టి విద్యార్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తామే సాధారణ తరగతుల సమయంలో అసైన్మెంట్లు మరియు హోంవర్క్లు ఇస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!