Hijab Ban: హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ.. త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు..
Hijab Ban issue: హిజాబ్ నిషేధం అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు హిజాబ్ తో పరీక్షలకు హాజరు కావడానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ కోసం త్రిసభ్య ధర్మసానాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ మేరకు హిజాబ్ కేసును అత్యవసర విచారణ కోసం లిస్ట్ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న కారణంగా ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషన్ దారుల తరుపు న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీంకోర్టును కోరారు. ఇప్పటికే పలువురు విద్యార్థినిలు నష్టపోయిన విషయాన్ని కోర్టుకు వెల్లడించారు.
Read Also:Kishan Reddy: అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. ఫోన్ చేసి..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
దీనికి సీజేఐ డీవై చంద్రచూడ్, కోర్టు దీనిని పరిశీలిస్తుందని.. అత్యవసర విచారణ కోసం జాబితా చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ తెలిపారు. 2022 అక్టోబర్ నెలలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హిజాబ్ కేసులో పరస్పర విరుద్ధమైన తీర్పులను వెలువరించారు. ఈ నేపథ్యంలో ఈ సారి త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తామని సీజేఐ అన్నారు.
2022 అక్టోబర్ తీర్పులో.. పాఠశాలల్లో యూనిఫాం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని ఓ న్యాయమూర్తి చెప్పగా, మరొకరు హిజాబ్ అనేది ముస్లిం మహిళల హక్కు అని పేర్కొన్నాడు. అంతకుముందు కర్ణాటక వ్యాప్తంగా పలు జిల్లాల్లో హిజాబ్ వ్యతిరేక, అనుకూల ఉద్యమాలు నడిచాయి. దీంతో ఈ అంశం కర్ణాటక హైకోర్టుకు చేరింది. గతేడాది మార్చి నెలలో కర్ణాటక హైకోర్టు తీర్పు చెబుతూ.. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని, పాఠశాల్లో హిజాబ్ బ్యాన్ సక్రమే అని తీర్పు చెప్పింది. దీంతో పలువురు ముస్లిం విద్యార్థినులు, హక్కుల సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!