Hijab Ban: హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ.. త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hijab Ban issue: హిజాబ్ నిషేధం అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు హిజాబ్ తో పరీక్షలకు హాజరు కావడానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ కోసం త్రిసభ్య ధర్మసానాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ మేరకు హిజాబ్ కేసును అత్యవసర విచారణ కోసం లిస్ట్ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న కారణంగా ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషన్ దారుల తరుపు న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీంకోర్టును కోరారు. ఇప్పటికే పలువురు విద్యార్థినిలు నష్టపోయిన విషయాన్ని కోర్టుకు వెల్లడించారు.
Read Also:Kishan Reddy: అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. ఫోన్ చేసి..
Also Read
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
దీనికి సీజేఐ డీవై చంద్రచూడ్, కోర్టు దీనిని పరిశీలిస్తుందని.. అత్యవసర విచారణ కోసం జాబితా చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ తెలిపారు. 2022 అక్టోబర్ నెలలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హిజాబ్ కేసులో పరస్పర విరుద్ధమైన తీర్పులను వెలువరించారు. ఈ నేపథ్యంలో ఈ సారి త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తామని సీజేఐ అన్నారు.
2022 అక్టోబర్ తీర్పులో.. పాఠశాలల్లో యూనిఫాం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని ఓ న్యాయమూర్తి చెప్పగా, మరొకరు హిజాబ్ అనేది ముస్లిం మహిళల హక్కు అని పేర్కొన్నాడు. అంతకుముందు కర్ణాటక వ్యాప్తంగా పలు జిల్లాల్లో హిజాబ్ వ్యతిరేక, అనుకూల ఉద్యమాలు నడిచాయి. దీంతో ఈ అంశం కర్ణాటక హైకోర్టుకు చేరింది. గతేడాది మార్చి నెలలో కర్ణాటక హైకోర్టు తీర్పు చెబుతూ.. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని, పాఠశాల్లో హిజాబ్ బ్యాన్ సక్రమే అని తీర్పు చెప్పింది. దీంతో పలువురు ముస్లిం విద్యార్థినులు, హక్కుల సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..