Hijab Ban: హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ.. త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hijab Ban issue: హిజాబ్ నిషేధం అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు హిజాబ్ తో పరీక్షలకు హాజరు కావడానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ కోసం త్రిసభ్య ధర్మసానాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ మేరకు హిజాబ్ కేసును అత్యవసర విచారణ కోసం లిస్ట్ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న కారణంగా ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషన్ దారుల తరుపు న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీంకోర్టును కోరారు. ఇప్పటికే పలువురు విద్యార్థినిలు నష్టపోయిన విషయాన్ని కోర్టుకు వెల్లడించారు.
Read Also:Kishan Reddy: అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. ఫోన్ చేసి..
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
దీనికి సీజేఐ డీవై చంద్రచూడ్, కోర్టు దీనిని పరిశీలిస్తుందని.. అత్యవసర విచారణ కోసం జాబితా చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ తెలిపారు. 2022 అక్టోబర్ నెలలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హిజాబ్ కేసులో పరస్పర విరుద్ధమైన తీర్పులను వెలువరించారు. ఈ నేపథ్యంలో ఈ సారి త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తామని సీజేఐ అన్నారు.
2022 అక్టోబర్ తీర్పులో.. పాఠశాలల్లో యూనిఫాం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని ఓ న్యాయమూర్తి చెప్పగా, మరొకరు హిజాబ్ అనేది ముస్లిం మహిళల హక్కు అని పేర్కొన్నాడు. అంతకుముందు కర్ణాటక వ్యాప్తంగా పలు జిల్లాల్లో హిజాబ్ వ్యతిరేక, అనుకూల ఉద్యమాలు నడిచాయి. దీంతో ఈ అంశం కర్ణాటక హైకోర్టుకు చేరింది. గతేడాది మార్చి నెలలో కర్ణాటక హైకోర్టు తీర్పు చెబుతూ.. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని, పాఠశాల్లో హిజాబ్ బ్యాన్ సక్రమే అని తీర్పు చెప్పింది. దీంతో పలువురు ముస్లిం విద్యార్థినులు, హక్కుల సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!