Sanjay Raut: మా ఓటమికి మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కారణం.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ..
- మా ఓటమికి కారణం మాజీ సీజేఐ చంద్రచూడ్..
- ఠాక్రే సేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ) దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో భాగస్వామి అయిన ఉద్ధవ్ సేన 95 సీట్లలో పోటీ చేస్తే కేవలం 20 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదని ఠాక్రే నిరాశనను వెలిబుబ్చారు. ఇదిలా ఉంటే, రాజ్యసభ ఎంపీ, ఠాక్రే సేన నేత సంజయ్ రౌత్ మాత్రం ఓటమికి పలు కారణాలను వెతుకుతున్నారు.
మహాయుతి ఘన విజయం పట్ల సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. తాజాగా తమ పార్టీ ఓటమికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కారణమంటూ ఆదివారం విమర్శలు చేశారు. ‘‘ అతను (చంద్రచూడ్) ఫిరాయింపుదారుల నుంచి చట్టం అంటే భయాన్ని తొలగించారు. అతడి పేరు నల్ల అక్షరాలతో వ్రాయబడింది’’ అని అన్నారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా, ఫిరాయింపుదారులకు తలుపులు, కిటికీలు తెరిచి ఉంచారని విమర్శలు చేశారు.
Also Read
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Hydrogen train: భారత తొలి హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది..? దీని వెనక ఉన్న సైన్స్ ఇదే..
Read Also: IPL Auction 2025: ప్రారంభమైన ఐపీఎల్ మెగా వేలం.. వీరిపైనే భారీ అంచనాలు
2022లో శివసేన పార్టీలో ఏక్నాథ్ షిండే చీలిక తీసుకువచ్చారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు షిండేకి ఉండటంతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం పదవిని స్వీకరించారు. అయితే, ఇలా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఠాక్రే వర్గం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. స్పీకర్ రాహుల్ నార్వేకర్ షిండే శివసేననే అసలైన శివసేనగా ప్రకటించింది. దీనిని ఉద్దేశిస్తూ రౌత్ మాజీ సీజేఐ చంద్రచూడ్పై విమర్శలు గుప్పించారు. ‘‘ మేము విచారంగా ఉన్నాం కానీ నిరాశ చెందలేదు. పోరాటాన్ని అసంపూర్తిగా వదిలిపెట్టము. ఓట్ల విభజన కూడా ఒక అంశం, మరియు ఎన్నికల్లో RSS ముఖ్యమైన పాత్ర పోషించింది. విషపూరిత ప్రచారం మమ్మల్ని ప్రతికూలంగా ప్రభావితం చేసింది’’ అని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవాన్ని పొరుగున ఉన్న గుజరాత్లో నిర్వహించాలని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సంజయ్ రౌత్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన 95 సీట్లలో 20 మాత్రమే గెలుచుకోగలిగింది. మొత్తం 101 స్థానాలకు గాను కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక మహాయుతి గత దశాబ్ధాల రికార్డుని బద్దలు కొడుతూ మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను గెలుచుకుంది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
-
Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
-
Hyderabad: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫ్యాన్స్కు పండగే..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?