Sanjay Raut: మా ఓటమికి మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కారణం.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ..
- మా ఓటమికి కారణం మాజీ సీజేఐ చంద్రచూడ్..
- ఠాక్రే సేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ) దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో భాగస్వామి అయిన ఉద్ధవ్ సేన 95 సీట్లలో పోటీ చేస్తే కేవలం 20 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదని ఠాక్రే నిరాశనను వెలిబుబ్చారు. ఇదిలా ఉంటే, రాజ్యసభ ఎంపీ, ఠాక్రే సేన నేత సంజయ్ రౌత్ మాత్రం ఓటమికి పలు కారణాలను వెతుకుతున్నారు.
మహాయుతి ఘన విజయం పట్ల సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. తాజాగా తమ పార్టీ ఓటమికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కారణమంటూ ఆదివారం విమర్శలు చేశారు. ‘‘ అతను (చంద్రచూడ్) ఫిరాయింపుదారుల నుంచి చట్టం అంటే భయాన్ని తొలగించారు. అతడి పేరు నల్ల అక్షరాలతో వ్రాయబడింది’’ అని అన్నారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా, ఫిరాయింపుదారులకు తలుపులు, కిటికీలు తెరిచి ఉంచారని విమర్శలు చేశారు.
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also: IPL Auction 2025: ప్రారంభమైన ఐపీఎల్ మెగా వేలం.. వీరిపైనే భారీ అంచనాలు
2022లో శివసేన పార్టీలో ఏక్నాథ్ షిండే చీలిక తీసుకువచ్చారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు షిండేకి ఉండటంతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం పదవిని స్వీకరించారు. అయితే, ఇలా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఠాక్రే వర్గం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. స్పీకర్ రాహుల్ నార్వేకర్ షిండే శివసేననే అసలైన శివసేనగా ప్రకటించింది. దీనిని ఉద్దేశిస్తూ రౌత్ మాజీ సీజేఐ చంద్రచూడ్పై విమర్శలు గుప్పించారు. ‘‘ మేము విచారంగా ఉన్నాం కానీ నిరాశ చెందలేదు. పోరాటాన్ని అసంపూర్తిగా వదిలిపెట్టము. ఓట్ల విభజన కూడా ఒక అంశం, మరియు ఎన్నికల్లో RSS ముఖ్యమైన పాత్ర పోషించింది. విషపూరిత ప్రచారం మమ్మల్ని ప్రతికూలంగా ప్రభావితం చేసింది’’ అని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవాన్ని పొరుగున ఉన్న గుజరాత్లో నిర్వహించాలని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సంజయ్ రౌత్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన 95 సీట్లలో 20 మాత్రమే గెలుచుకోగలిగింది. మొత్తం 101 స్థానాలకు గాను కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక మహాయుతి గత దశాబ్ధాల రికార్డుని బద్దలు కొడుతూ మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను గెలుచుకుంది.
తాజావార్తలు
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!