Sanjay Raut: మా ఓటమికి మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కారణం.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ..
- మా ఓటమికి కారణం మాజీ సీజేఐ చంద్రచూడ్..
- ఠాక్రే సేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ) దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో భాగస్వామి అయిన ఉద్ధవ్ సేన 95 సీట్లలో పోటీ చేస్తే కేవలం 20 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదని ఠాక్రే నిరాశనను వెలిబుబ్చారు. ఇదిలా ఉంటే, రాజ్యసభ ఎంపీ, ఠాక్రే సేన నేత సంజయ్ రౌత్ మాత్రం ఓటమికి పలు కారణాలను వెతుకుతున్నారు.
మహాయుతి ఘన విజయం పట్ల సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. తాజాగా తమ పార్టీ ఓటమికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కారణమంటూ ఆదివారం విమర్శలు చేశారు. ‘‘ అతను (చంద్రచూడ్) ఫిరాయింపుదారుల నుంచి చట్టం అంటే భయాన్ని తొలగించారు. అతడి పేరు నల్ల అక్షరాలతో వ్రాయబడింది’’ అని అన్నారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా, ఫిరాయింపుదారులకు తలుపులు, కిటికీలు తెరిచి ఉంచారని విమర్శలు చేశారు.
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
Read Also: IPL Auction 2025: ప్రారంభమైన ఐపీఎల్ మెగా వేలం.. వీరిపైనే భారీ అంచనాలు
2022లో శివసేన పార్టీలో ఏక్నాథ్ షిండే చీలిక తీసుకువచ్చారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు షిండేకి ఉండటంతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం పదవిని స్వీకరించారు. అయితే, ఇలా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఠాక్రే వర్గం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. స్పీకర్ రాహుల్ నార్వేకర్ షిండే శివసేననే అసలైన శివసేనగా ప్రకటించింది. దీనిని ఉద్దేశిస్తూ రౌత్ మాజీ సీజేఐ చంద్రచూడ్పై విమర్శలు గుప్పించారు. ‘‘ మేము విచారంగా ఉన్నాం కానీ నిరాశ చెందలేదు. పోరాటాన్ని అసంపూర్తిగా వదిలిపెట్టము. ఓట్ల విభజన కూడా ఒక అంశం, మరియు ఎన్నికల్లో RSS ముఖ్యమైన పాత్ర పోషించింది. విషపూరిత ప్రచారం మమ్మల్ని ప్రతికూలంగా ప్రభావితం చేసింది’’ అని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవాన్ని పొరుగున ఉన్న గుజరాత్లో నిర్వహించాలని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సంజయ్ రౌత్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన 95 సీట్లలో 20 మాత్రమే గెలుచుకోగలిగింది. మొత్తం 101 స్థానాలకు గాను కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక మహాయుతి గత దశాబ్ధాల రికార్డుని బద్దలు కొడుతూ మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను గెలుచుకుంది.
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!