Sanjay Raut: రూటు మార్చిన సంజయ్ రౌత్.. దేవేంద్ర ఫడ్నవీస్పై ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut Praises BJP’s Devendra Fadnavis: పత్రాచల్ భూముల కుంభకోణంలో 103 రోజుల పాటు జైలులో ఉన్నాడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక నేత సంజయ్ రౌత్. ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. అయితే నిన్న జైలు నుంచి విడుదలయ్యారు సంజయ్ రౌత్. బీజేపీ అంటేనే విరుచుకుపడే సంజయ్ రౌత్.. ఆ పార్టీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రశంసలు కురిపించారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత రూటు మార్చిన సంజయ్ రౌత్.. బీజేపీ నేతను పొగడటం చర్చనీయాంశంగా మారింది. మళ్లీ బీజేపీతో కలిసేందుకు సిద్ధం అవుతున్నారా..? అనే వాదనలు ఉన్నాయి.
మూడు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాతి రోజే సంజయ్ రౌత్ గురువారం రోజు డిఫ్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఉంది.. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటుందని.. దేవేంద్ర ఫడ్నవీస్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారని..పేదలకు గృహ నిర్మాణం వంటి నిర్ణయాలను ప్రశంసించారు. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి మరన్ని హక్కులు కల్పించాలనే నిర్ణయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మా ప్రభుత్వం ఉన్న సమయంలో ఆ హక్కుల్ని తొలగించామని.. నాకు అది నచ్చలేదని.. ఫడ్నవీస్ వీటిని పునరుద్దరించడం మంచి విషయమని సంజయ్ రౌత్ అన్నారు.
Also Read
- TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
- Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
Read Also: India vs England: భారత్ ఘోర పరాజయం.. చెప్పినట్లే చితక్కొట్టిన ఇంగ్లండ్
త్వరలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలుస్తానని.. నా విషయంలో ఏం జరిగిందో వారికి చెబుతా అని అన్నారు. రాజకీయ విద్వేషాలు తగ్గించుకోవాలని దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను ఆయన స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రశంసలు గుప్పిస్తూనే.. సీఎం ఏక్ నాథ్ షిండే పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. ఏక్ నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చినప్పుడు, సంజయ్ రౌత్ బీజేపీని, ఏక్ నాథ్ షిండేను తీవ్రస్థాయిలో విమర్శించారు.
విడుదలైన తర్వాత బీజేపీపై కానీ.. ఈడీపై కానీ ఎలాంటి విమర్శలు చేయలేదు సంజయ్ రౌత్. తన కుటుంబం కష్టాల్లో ఉందని అన్నారు. మూడు నెలల కాలంలో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ లు నాతో ఫోన్ లో మాట్లాడారని ఆయన అన్నారు. ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపిన వీడీ సావర్కర్, బాలగంగాధర్, అటల్ బిహారీ వాజ్పేయి నుంచి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు. “రాజకీయాల్లో ఎవరున్నా ఏదో ఒక సమయంలో జైలుకు వెళ్లాల్సిందేనని అని అన్నారు.
తాజావార్తలు
-
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
-
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!