India vs England: భారత్ ఘోర పరాజయం.. చెప్పినట్లే చితక్కొట్టిన ఇంగ్లండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England Won Against India In T20 World Cup Semi Final: నిన్న న్యూజీల్యాండ్పై పాకిస్తాన్ గెలవడమే ఆలస్యం.. ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్యే ఉంటుందని మనవాళ్లు కథనాలు అల్లేసుకున్నారు. ఇంగ్లండ్ని ఓడించడం భారత్కి పెద్ద సమస్యేమీ కాదని.. ఆల్రెడీ ఈ టోర్నీలో ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో ఓడిన ఘనత ఇంగ్లండ్ది కాబట్టి, మన టీమిండియా ఆ జట్టుని మట్టికరిపించి, ఫైనల్లో బెర్త్ కన్ఫమ్ చేసుకుంటుందని అంచనాలు వేసుకున్నారు. సరిగ్గా అప్పుడే ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఫైనల్లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఉండదని, తాము భారత్ని ఫైనల్కి వెళ్లనివ్వమని బల్లగుద్ది మరీ చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే.. సెమీ ఫైనల్లో భారత్ని ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. భారత్ కుదిర్చిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే సునాయాసంగా చేధించింది.
తొలుత ఇంగ్లండ్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత జట్టు రంగంలోకి దిగింది. ఇది కీలకమైన మ్యాచ్ కాబట్టి.. కచ్ఛితంగా ఓపెనర్లు దుమ్ముదులుపుతారని అనుకున్నారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ చితక్కొట్టడం ఖాయమని భావించారు. తీరా చూస్తే.. ఆ ఇద్దరు చెత్త ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచారు. ఎప్పట్లాగే ఈసారి కూడా రాహుల్ మొదట్లోనే చేతులెత్తేశాడు. 5 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇక రోహిత్ శర్మ అయితే ఖాతా తెరవకుండా, వన్డే తరహాలో నిదానంగా ఆడాడు. 28 బంతుల్లో 27 పరుగులే చేశాడు. మెయిన్ వికెట్లు పోవడంతో.. కోహ్లీ ఆచితూచి ఆడుతూ, 40 బంతుల్లో అర్ధశతకం చేశాడు. ఇక ‘మిస్టర్ 360’గా పేరుగాంచిన సూర్య కూడా 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా ఆపద్భాంధవుడిలా టీమిండియాని ఆదుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లు ధీటుగా ఎదుర్కొని, పరుగుల వర్షం లంకించాడు. కేవలం 33 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. అతని పుణ్యమా అని.. భారత్ కనీసం గౌరవప్రదమైన స్కోరు (168) చేయగలిగింది.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
169 పరుగుల లక్ష్యం మరీ చిన్నదేమీ కాదు.. ఈజీగానే డిఫెండ్ చేసుకోవచ్చు. పైగా.. ఈ టోర్నీలో మన భారత బౌలర్లు బాగానే రాణించారు కాబట్టి, ఈ మ్యాచ్లో కూడా ట్విస్టులు ఇస్తారని ఊహించారు. కానీ, అత్యంత కీలకమైన ఈ సెమీ ఫైనల్లో మాత్రం భారత బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. వికెట్ తీయడం ఏమో కానీ, కనీసం పరుగుల్ని ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. ‘ఇదిగోండి, కొట్టుకోండి’ అన్నట్టు ప్రత్యర్టుల బ్యాటర్లకు బంతులు అందివ్వడంతో.. ఇంగ్లండ్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. 17 ఓవర్లలోనే 170 పరుగులు చేసి, భారత్పై సంచలన విజయం సాధించింది. ప్రారంభం నుంచే ఇంగ్లండ్ ఓపెనర్లైనా జాస్ బట్లర్(80), అలెక్స్ హేల్స్(86) ఎడాపెడా షాట్లు ఆడటంతో, భారత బౌలర్లు ఒత్తిడి గురయ్యారు. ఆ టెన్షన్లో వికెట్ తీయడం మరిచి, పరుగులు ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్తో తలపడనుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!