India vs England: భారత్ ఘోర పరాజయం.. చెప్పినట్లే చితక్కొట్టిన ఇంగ్లండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England Won Against India In T20 World Cup Semi Final: నిన్న న్యూజీల్యాండ్పై పాకిస్తాన్ గెలవడమే ఆలస్యం.. ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్యే ఉంటుందని మనవాళ్లు కథనాలు అల్లేసుకున్నారు. ఇంగ్లండ్ని ఓడించడం భారత్కి పెద్ద సమస్యేమీ కాదని.. ఆల్రెడీ ఈ టోర్నీలో ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో ఓడిన ఘనత ఇంగ్లండ్ది కాబట్టి, మన టీమిండియా ఆ జట్టుని మట్టికరిపించి, ఫైనల్లో బెర్త్ కన్ఫమ్ చేసుకుంటుందని అంచనాలు వేసుకున్నారు. సరిగ్గా అప్పుడే ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఫైనల్లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఉండదని, తాము భారత్ని ఫైనల్కి వెళ్లనివ్వమని బల్లగుద్ది మరీ చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే.. సెమీ ఫైనల్లో భారత్ని ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. భారత్ కుదిర్చిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే సునాయాసంగా చేధించింది.
తొలుత ఇంగ్లండ్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత జట్టు రంగంలోకి దిగింది. ఇది కీలకమైన మ్యాచ్ కాబట్టి.. కచ్ఛితంగా ఓపెనర్లు దుమ్ముదులుపుతారని అనుకున్నారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ చితక్కొట్టడం ఖాయమని భావించారు. తీరా చూస్తే.. ఆ ఇద్దరు చెత్త ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచారు. ఎప్పట్లాగే ఈసారి కూడా రాహుల్ మొదట్లోనే చేతులెత్తేశాడు. 5 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇక రోహిత్ శర్మ అయితే ఖాతా తెరవకుండా, వన్డే తరహాలో నిదానంగా ఆడాడు. 28 బంతుల్లో 27 పరుగులే చేశాడు. మెయిన్ వికెట్లు పోవడంతో.. కోహ్లీ ఆచితూచి ఆడుతూ, 40 బంతుల్లో అర్ధశతకం చేశాడు. ఇక ‘మిస్టర్ 360’గా పేరుగాంచిన సూర్య కూడా 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా ఆపద్భాంధవుడిలా టీమిండియాని ఆదుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లు ధీటుగా ఎదుర్కొని, పరుగుల వర్షం లంకించాడు. కేవలం 33 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. అతని పుణ్యమా అని.. భారత్ కనీసం గౌరవప్రదమైన స్కోరు (168) చేయగలిగింది.
Also Read
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
169 పరుగుల లక్ష్యం మరీ చిన్నదేమీ కాదు.. ఈజీగానే డిఫెండ్ చేసుకోవచ్చు. పైగా.. ఈ టోర్నీలో మన భారత బౌలర్లు బాగానే రాణించారు కాబట్టి, ఈ మ్యాచ్లో కూడా ట్విస్టులు ఇస్తారని ఊహించారు. కానీ, అత్యంత కీలకమైన ఈ సెమీ ఫైనల్లో మాత్రం భారత బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. వికెట్ తీయడం ఏమో కానీ, కనీసం పరుగుల్ని ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. ‘ఇదిగోండి, కొట్టుకోండి’ అన్నట్టు ప్రత్యర్టుల బ్యాటర్లకు బంతులు అందివ్వడంతో.. ఇంగ్లండ్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. 17 ఓవర్లలోనే 170 పరుగులు చేసి, భారత్పై సంచలన విజయం సాధించింది. ప్రారంభం నుంచే ఇంగ్లండ్ ఓపెనర్లైనా జాస్ బట్లర్(80), అలెక్స్ హేల్స్(86) ఎడాపెడా షాట్లు ఆడటంతో, భారత బౌలర్లు ఒత్తిడి గురయ్యారు. ఆ టెన్షన్లో వికెట్ తీయడం మరిచి, పరుగులు ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్తో తలపడనుంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!