ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఓవైపు అధికార బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష ఎస్పీ.. ఇంకో వైపు కాంగ్రెస్, మరోవైపు బీఎస్పీ ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. అయితే, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. అందేంటి? బీజేపీకి వరుసగా షాక్లు ఇస్తూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ.. ఎస్పీ గూటికి క్యూ కడుతోన్న సమయంలో.. అఖిలేష్ యాదవ్.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం ఏంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. విషయం ఏంటంటే.. అది కేవలం ఉన్నావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం.
Read Also: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఉన్నావ్ స్థానం నుంచి ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్ను పోటీకి పెట్టింది… దీనిపై తాజాగా స్పందించిన సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. ఉన్నావ్ నియోజకవర్గంలో కాంగ్రెస్పార్టీకి మద్దతుగా ఉంటామని.. ఆ స్థానం నుంచి ఎస్పీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉన్నావ్ అత్యాచార కేసు బాధితురాలి తల్లికి తాము అడ్డురామని స్పష్టం చేసిన ఆయన.. ఆమెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.