Sengol: పార్లమెంట్లో ‘‘సెంగోల్’’ స్థానంలో రాజ్యాంగం పెట్టాలి.. అఖిలేష్ పార్టీ ఎంపీ డిమాండ్..
- మరోసారి చర్చనీయాంశంగా ‘‘సెంగోల్’’
- సెంగోల్ స్థానంతో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలి
- సమాజ్వాదీ ఎంపీ డిమాండ్
- భారతీయ సంస్కృతిపై ఇండియా కూటమికి గౌరవం లేదన్న బీజేపీ
- డీఎంకే దీనిపై ఎలా స్పందిస్తుందో చెప్పాలన్న సీఎం యోగి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sengol: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ‘సెంగోల్’ని ప్రతిష్టించారు. ఆ సమయంలో ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ సెంగోల్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ(ఎస్పీ)కి చెందిన ఎంపీ ఆర్కే చౌదరి సెంగోల్ స్థానంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. 5 అడుగుల పొడవు, బంగారు పూతతో చేతితో తయారు చేసిన సెంగోల్ గురించి మరోసారి చర్చ మొదలైంది.
యూపీ మోహన్లాల్ గంజ్ ఎంపీగా ఉన్న చౌదరి సెంగోల్ స్థానంలో రాజ్యాంగం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని ఆమోదించడం దేశంలో ప్రజాస్వామ్యానికి నాంది పలికింది, రాజ్యాంగం దాని చిహ్నం. బిజెపి ప్రభుత్వం తన చివరి టర్మ్లో స్పీకర్ కుర్చీ పక్కన ‘సెంగోల్’ని ఏర్పాటు చేసింది. సెంగోల్ అనేది తమిళ పదం, దీని అర్థం రాజదండం. రాజ్దండ్ కూడా రాజుల యుగం తర్వాత మనం స్వతంత్రులం అయ్యాం అని అర్థం. ప్రస్తుతం ప్రతీ ఒక్కరు కూడా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని దేశంలో ఎన్నుకుంటున్నారు. దేశం రాజ్యాంగం ఆధారంగా నడుస్తుంది. రాజదండం ద్వారా కాదు.’’ అని అతను అన్నారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Addanki Dayakar : బీఆర్ఎస్కు అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తుకోవాలని తెలవడం లేదు
ఈ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్లోని 80 ఎంపీ స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ 37 సీట్లను గెలుచుకుంది. పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఎస్పీ మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. పార్టీ ఎంపీ వ్యాఖ్యపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. సెంగోల్ పెట్టిన సమయంలో ప్రధాని దానికి నమస్కరించారు, కానీ ఈ సారి ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ఆయన నమస్కరించడం మరిచిపోయారని, మా ఎంపీ ప్రధానికి గుర్తు చేయాలనునకుంటున్నారని నేను భావిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, ఆర్జేడీ ఎంపీ లాలూ కుమార్తె మిసా భారతి కూడా ఎస్పీ ఎంపీ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు.
అయితే, ఎస్పీ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. సమాజ్వాదీ పార్టీకి భారతీయ చరిత్ర, సంస్కృతి పట్ల గౌరవం లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తమిళ సంస్కృతి పట్ల భారత కూటమి యొక్క ద్వేషాన్ని చూపిస్తోందని యోగి అన్నారు. గతంలో ఎస్పీ రామచరితమానస్పై దాడి చేసిందని, ఇప్పుడు భారత సంస్కృతిపై దాడి చేసిందని చెప్పారు. ఈ అవమానికి డీఎంకే ఎలా స్పందిస్తుందో చెప్పాలని యోగి అన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?