Saji Cheriyan: రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి పదవి ఊడింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మంత్రి పదవి ఊడిపోయింది.. కేరళ మత్స్యకార, సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్.. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.. చెరియన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షాలు.. అతడిని కేబినెట్ నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశాయి.. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.. ఇక, మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. రాష్ట్ర గవర్నర్తో పాటు సీఎం పినరయి విజయన్ కూడా వివరణ కోరిన విషయం తెలిసిందే కాగా.. తన వ్యాఖ్యాలు వివాదానికి కారణం కావడంతో.. ఇవాళ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు సాజీ చెరియన్.
Read Also: BJP: ఎవరినీ వదులుకోవద్దు.. చేరికలపై బీజేపీ హైకమాండ్ కీలక ఆదేశాలు
Also Read
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
కేరళలో రాజ్యాంగంపై తను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో.. ఒక రోజు తర్వాత సాజీ చెరియన్ బుధవారం కేరళ సాంస్కృతిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. “నేను రాజీనామా చేశాను, అది నా వ్యక్తిగత నిర్ణయం.. నేనెప్పుడూ రాజ్యాంగాన్ని కించపరచలేదు.. సీపీఐ-ఎం, ఎల్డీఎఫ్లను బలహీనపరిచేందుకు ప్రసంగంలోని కొంత భాగాన్ని తీసుకుని వివాదం సృష్టించారని తన ప్రకటనలో పేర్కొన్నారు చెరియన్.. కాగా, మల్లపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చెరియన్.. అక్కడ ప్రసంగిస్తూ.. కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనుమతించదు.. కానీ, వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందంటూ వ్యాఖ్యానించారు.. దీంతోనే దేశంలో కార్పొరేట్ రంగం విస్తరిస్తూ.. మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని పేర్కొన్న ఆయన.. బ్రిటీష్ వారు సంకలనం చేసిన రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశారని.. దానినే 75 ఏళ్లుగా అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటివి వాటిలో పొందుపరిచారని.. ఎవరు దీనికి విరుద్ధంగా చెప్పినా తాను అంగీకరించబోనని చెరియన్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే..
అయితే, కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి చెరియన్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. కేరళలోనే లెఫ్ట్ సర్కార్పై కూడా విమర్శలు పెరిగాయి.. చెరియన్ వ్యాఖ్యలను ‘అసహ్యకరమైనవి’గా కాంగ్రెస్ అభివర్ణించగా, అతను రాజ్యాంగాన్ని అగౌరవపరిచాడు అంటూ బీజేపీ మండిపడింది.. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడం.. గవర్నర్, సీఎం, పార్టీ నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో.. చివరకు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు సాజీ చెరియన్.
తాజావార్తలు
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి