BJP: ఎవరినీ వదులుకోవద్దు.. చేరికలపై బీజేపీ హైకమాండ్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ నేతలు స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి నియోజకవర్గాల వరకు అందరిలో కదలిక తెచ్చారు.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటారు.. ఇక, ఆ సభకు వచ్చిన జనాన్ని చూసి ప్రధాని నరేంద్ర మోడీ ఫిదా అయిపోయారు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ప్రశంసలు కురిపించారు. అయితే, పార్టీలో చేరికలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే కాషాయం కండువా కప్పుకోగా.. మరికొందరి చేరికల విషయంలో సొంత పార్టీ నేతలే.. తమకు ఎక్కడ ఇబ్బందిగా మారుతారో ఏమోనని మోకాలడ్డుతున్నారట.. అయితే, చేరికల విషయంలో రాష్ట్ర నాయకత్వం అవలంభిస్తున్న తీరుపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. అసలు ఎవరినీ వదులుకోవద్దు.. చేరికలపై సీరియస్గా దృష్టి సారించాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది.
Read Also: Business Updates: ఈ రోజు బిజినెస్ వార్తలు..
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
ఇప్పటికే పలు మార్లు చేరికలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలు చెప్పినా.. ఇగోలు పక్కన పెట్టాలని చెప్పినా రాష్ట్ర నేతలు పట్టించుకోవడం లేదని అధిష్టానం సీరియస్ గా ఉందట.. నేతల మధ్య ఏకాభిప్రాయం రాక , ఒకరు తెచ్చిన వ్యక్తిని మరొకరు అడ్డుకోవడంతో పలువురు నేతల చేరికలు ఆగిపోయాయి.. ఇదే అంశాన్ని హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లారు కొందరు నేతలు.. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్ర నేతలను మందలించినట్టుగా తెలుస్తోంది.. రాష్ట్ర నేతల భేటీలో చేరికలపై క్లారిటీ ఇచ్చేశారు.. చేరికల కమిటీలో ఎవరు ఉండాలని పేర్లను ఫైనల్ చేసింది కూడా ఢిల్లీ పెద్దలే.. అయితే, రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం ఉంటే అలాంటి వారిని వెంటనే చేర్చుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.. కానీ, ఏకాభిప్రాయం రానివి ఉంటే తమ దగ్గరికి పంపించండి అని ఖరాఖండిగా చెప్పేశారట నడ్డా, అమిత్ షా.. ఇదే సమయంలో ఎవరినీ వదులుకోవద్దు అనే సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.. తాము 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలంగాణ నేతలకు స్పష్టం నడ్డా, షా స్పష్టం చేశారు.. అన్ని రకాల సహాయ సహకరాలకు సిద్ధమని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ సూచిచిందని చెబుతున్నారు. దీంతో, బీజేపీలో మరికొంత మంది నేతలు చేరే అవకాశం ఉందని.. ఇప్పటికే ఆగిపోయిన చేరికలు.. ఇక ఊపందుకుంటాయని తెలుస్తోంది.
తాజావార్తలు
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!