BJP: ఎవరినీ వదులుకోవద్దు.. చేరికలపై బీజేపీ హైకమాండ్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ నేతలు స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి నియోజకవర్గాల వరకు అందరిలో కదలిక తెచ్చారు.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటారు.. ఇక, ఆ సభకు వచ్చిన జనాన్ని చూసి ప్రధాని నరేంద్ర మోడీ ఫిదా అయిపోయారు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ప్రశంసలు కురిపించారు. అయితే, పార్టీలో చేరికలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే కాషాయం కండువా కప్పుకోగా.. మరికొందరి చేరికల విషయంలో సొంత పార్టీ నేతలే.. తమకు ఎక్కడ ఇబ్బందిగా మారుతారో ఏమోనని మోకాలడ్డుతున్నారట.. అయితే, చేరికల విషయంలో రాష్ట్ర నాయకత్వం అవలంభిస్తున్న తీరుపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. అసలు ఎవరినీ వదులుకోవద్దు.. చేరికలపై సీరియస్గా దృష్టి సారించాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది.
Read Also: Business Updates: ఈ రోజు బిజినెస్ వార్తలు..
Also Read
ఇప్పటికే పలు మార్లు చేరికలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలు చెప్పినా.. ఇగోలు పక్కన పెట్టాలని చెప్పినా రాష్ట్ర నేతలు పట్టించుకోవడం లేదని అధిష్టానం సీరియస్ గా ఉందట.. నేతల మధ్య ఏకాభిప్రాయం రాక , ఒకరు తెచ్చిన వ్యక్తిని మరొకరు అడ్డుకోవడంతో పలువురు నేతల చేరికలు ఆగిపోయాయి.. ఇదే అంశాన్ని హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లారు కొందరు నేతలు.. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్ర నేతలను మందలించినట్టుగా తెలుస్తోంది.. రాష్ట్ర నేతల భేటీలో చేరికలపై క్లారిటీ ఇచ్చేశారు.. చేరికల కమిటీలో ఎవరు ఉండాలని పేర్లను ఫైనల్ చేసింది కూడా ఢిల్లీ పెద్దలే.. అయితే, రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం ఉంటే అలాంటి వారిని వెంటనే చేర్చుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.. కానీ, ఏకాభిప్రాయం రానివి ఉంటే తమ దగ్గరికి పంపించండి అని ఖరాఖండిగా చెప్పేశారట నడ్డా, అమిత్ షా.. ఇదే సమయంలో ఎవరినీ వదులుకోవద్దు అనే సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.. తాము 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలంగాణ నేతలకు స్పష్టం నడ్డా, షా స్పష్టం చేశారు.. అన్ని రకాల సహాయ సహకరాలకు సిద్ధమని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ సూచిచిందని చెబుతున్నారు. దీంతో, బీజేపీలో మరికొంత మంది నేతలు చేరే అవకాశం ఉందని.. ఇప్పటికే ఆగిపోయిన చేరికలు.. ఇక ఊపందుకుంటాయని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!