క్రికెట్ దిగ్గజం, భారతరత్న పురస్కార గ్రహీత సచిన్ టెండుల్కర్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుసుకున్నారు. ముంబై పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. శుక్రవారం ఉదయం రాజ్ భవన్లో సచిన్తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనే అని తెలుస్తోంది. కాగా రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీకాలం మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. మరోవైపు ఇటీవల అండర్-19 భారతజట్టుకు ‘మీకు వంద కోట్ల మందికిపైగా మద్దతు బలం ఉంది. మంచిగా ఆడి, మెరుగైన ఫలితాలు సాధించాలి’ అంటూ సచిన్ పిలుపు ఇవ్వడం తెలిసిందే.
Legendary cricketer and Bharat Ratna Shri Sachin Tendulkar called on President Ram Nath Kovind at Raj Bhavan, Mumbai. pic.twitter.com/CreSGku2H7
— President of India (@rashtrapatibhvn) February 11, 2022