Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
- పార్లమెంట్ సజావుగా సాగనివ్వండి
- రెబల్ టీఎంసీ ఎంపీ సాయోని ఘోష్ విజ్ఞప్తి
- అసెంబ్లీ ఎన్నికల తర్వాత తిరుగుబావుటా ఎగరేసిన ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకుండా ప్రతిరోజూ అంతరాయం ఏర్పడుతుండటంపై రెబల్ టీఎంసీ ఎంపీ సాయోని ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. కోల్కతాలో ఆమె మీడియాతో మాట్లాడారు. సభలో నిరంతరం గందరగోళం కొనసాగడం వల్ల ప్రజల పన్నుల సొమ్ము వృథా అవుతోందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్లో ప్రస్తావించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలను లక్ష్యంగా చేసుకుని ఇండియా కూటమి నిర్వహించిన నిరసన ప్రదర్శనను విమర్శించారు.
‘‘పార్లమెంట్ సజావుగా పనిచేయడం లేదు. ప్రతిరోజూ సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా అవుతోంది. ప్రశ్నోత్తరాల సమయమైనా, జీరో అవర్ అయినా.. మా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించలేకపోతున్నాం. ఇది నిజంగా చాలా దురదృష్టకరం’’ అని ఆమె అన్నారు. తమ ప్రాంతాలకు సంబంధించిన అంశాలపై ప్రజలు ఎంపీలపై ఎంతో ఆశలు పెట్టుకుంటారని సాయోని ఘోష్ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తారని ఆశిస్తారని తెలిపారు.
Also Read
- El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
- Delhi: ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో సంచలన తీర్పు.. మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్కు జీవిత ఖైదు
- PM-KISAN Scheme: రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. మరో ఐదేళ్లు పీఎం-కిసాన్
- Central Cabinet Decision: సముద్ర మంథన్ ప్రాజెక్ట్ ఆమోదం.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
‘‘నా ఒక్కటే విజ్ఞప్తి.. పార్లమెంట్ను సజావుగా నడవనివ్వండి. సభ వెలుపల మీకు నచ్చిన విధంగా నిరసనలు చేయండి. కానీ సభ లోపల పార్లమెంట్ సక్రమంగా సాగేందుకు అధికార పక్షానికి బాధ్యత ఉంది. అదే సమయంలో ప్రతిపక్షం కూడా తన బాధ్యతను నిర్వర్తించాలి’’ అని స్పష్టం చేశారు. పార్లమెంట్లో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలా సహకరించాలని సాయోని ఘోష్ కోరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత పలువురు ఎంపీలు తిరుగుబావుటా ఎగరేశారు.
#WATCH | Kolkata, West Bengal: On the INDIA alliance protest performance targeting Ram Temple donation theft, Rebel TMC MP and NCPI leader Saayoni Ghosh says, “The House is not functioning. The proceedings are being disrupted every day, and taxpayers’ money is being wasted. We… pic.twitter.com/pfHCdzmvBM
— ANI (@ANI) July 31, 2026
తాజావార్తలు
-
Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
-
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
-
The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్నెస్కు రెడీ అవ్వండి!
-
Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
-
CM Revanth Reddy : పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు TOMCOMదే బాధ్యత
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!