Delhi Good Thieves: ‘మంచి’ దొంగలు.. పైసలు లేవని, వంద పెట్టి వెళ్లారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbers Stopped A Couple To Rob Them But Changed Their Plan: దొంగల పనేంటి..? బెదిరించామా, దోపిడీ చేశామా, వెళ్లిపోయామా, అంతే. అవతల వ్యక్తుల పరిస్థితి ఏంటి? వారి ధనవంతులా, కాదా? అనేది దొంగలకు అనవసరం. దోచుకోవడమే వారి ప్రధాన లక్ష్యం. కానీ.. అందరూ దొంగలు ఇలాగే ఉండరని, అప్పుడప్పుడు కొందరు మంచి దొంగలు కూడా వెలుగు చూశారు. దొంగలించిన సామాన్లు తిరిగి ఇచ్చేయడమో, ఏమీ లేవని తిరిగి దొంగలే ఆర్థిక సహాయం చేయడమో వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో తాజాగా అలాంటి వ్యవహారమే వెలుగుచూసింది. ఓ జంటని దోచుకుందామని ఇద్దరు దొంగలు ప్లాన్ చేయగా.. వారి వద్ద ఏమీ లేవని తెలిసి, తిరిగి రూ.100 వారి చేతిలో పెట్టి వెళ్లిపోయారు.
NTR: ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి.. వీరికి ఒక సాంగ్ పడితే ఉంటుంది సామీ
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
ఆ వివరాల్లోకి వెళ్తే.. తూర్పు ఢిల్లీలోని షాహదారాలోని ఫార్ష్ బజార్లో ఓ జంటను నడుచుకుంటూ వెళ్తోంది. సడెన్గా వారి ముందు ఒక బైక్ వచ్చి ఆగింది. ఆ బైక్పై ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. బైక్ నుంచి వాళ్లిద్దరు దిగి.. తమకు డబ్బులు ఇవ్వాలని ఆ జంటని బెదిరించారు. తమ వద్ద ఏమీ లేదని, తమని వదిలేయమని ఆ జంట ప్రాధేయపడింది. అయినా ఆ దొంగలు వినిపించుకోలేదు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి.. వారిని తనిఖీ చేయడం ప్రారంభించాడు. వారి వద్ద నుంచి కేవలం రూ.20 నోటు మాత్రమే దొంగలకు దొరికింది. అంతే, అంతకుమించి ఆ జంట వద్ద ఏమీ లేదు. దీంతో.. తిరిగి దొంగలే సానుభూతితో దంపతుల చేతిలో రూ.100 పెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మొత్తం తతంగమంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
Bride Kidnap: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వధువు మెడపై కత్తిపెట్టి కిడ్నాప్
ఈ ఘటనతో బెదిరిపోయిన ఆ జంట.. పోలీస్ స్టేషన్కు వెళ్లి, జరిగిందంతా చెప్పారు. దీంతో పోలీసులు ఆ దొంగల్ని గాలించడం మొదలుపెట్టారు. దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఎట్టకేలకు ఆ ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు. వారిని దేవ్ వర్మ, హర్ష్ రాజ్పుత్గా గుర్తించారు. వర్మ ఒక ప్రైవేట్ జీఎస్టీ సంస్థలో అకౌంటెంట్ కాగా, రాజ్పుత్ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. యూట్యూబ్లో గ్యాంగ్స్టర్ నీరజ్ బవానా వీడియోల ద్వారా తాము ప్రభావితం అయ్యామని వాళ్లు తెలిపారు. నిందితుల నుంచి పోలీసులు 30 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..