Bihar Elections: తేజస్వీ యాదవ్ గెలిస్తే “వక్ఫ్ చట్టాన్ని” రద్దు చేస్తారు.. ఆర్జేడీ హామీపై బీజేపీ ఫైర్..
- తేజస్వీ యాదవ్ గెలిస్తే వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తారు..
- వివాదాస్పదంగా మారిన ఆర్జేడీ నేత కామెంట్స్..
- జంగిల్ రాజ్ లక్షణాలు కనిపిస్తున్నాయని బీజేపీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. రాష్ట్రంలోని 243 స్థానాలకు గానూ రెండు విడతల్లో నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న బీహార్ ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఇప్పుడు ఆర్జేడీ నేత, ఎంఎల్సీ ఖారీ సోహైబ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆర్జేడీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ.. ‘‘తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అయితే, వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తారు. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చిన వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారు’’ అంటూ సోహైల్ అన్నారు.
Read Also: Jaanhvi Kapoor : పురుష అహంకారం.. హీరోలపై జాన్వీకపూర్ సంచలన కామెంట్స్
Also Read
- Kavitha: కవితకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్..!
- UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
- Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఎక్స్ పోస్టులో.. ‘‘ ఆర్జేడీ నిజమైన స్వరూపం తెలిసింది. భూమిని దోచుకోవాలనే ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. జంగిల్ రాజ్ ఎలా ఉంటుందో అదే కనిపిస్తోంది’’ అని విమర్శించారు. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘ఎవరికి బుద్ధి చెప్పాలి. ఇవి జంగిల్ రాజ్ సంకేతాలు, దానిని అణిచివేయాలి’’ అని అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ సుప్రీంకోర్టు, పార్లమెంట్ను గౌరవించవని, ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా అవమానిస్తాయని రిజిజు ఆరోపించారు. బీహార్ ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో వక్ఫ్ సవరణ చట్టం-2025 అమలులోకి వచ్చింది. 1995 చట్టాన్ని సవరించి, వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పారదర్శకతను పెంచడానికి బీజేపీ సర్కార్ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. వక్ఫ్ ఆస్తుల్ని డిజిటలైజ్ చేయడం, వక్ఫ్ బోర్డులో షియా, పాష్మాండా, బోహ్రా, ముస్లింయేతర వర్గాల మహిళలకు, సభ్యులను కూడా వక్ఫ్ బోర్డులో చేర్చడం వంటి నిబంధనల్ని తీసుకువచ్చింది. అయితే, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే వంటి ప్రతిపక్ష పార్టీలు దీనిని మైనారిటీ వ్యతిరేక చర్యగా అభివర్ణించాయి.
RJD which is already embroiled & entangled in Land for Jobs Scam and Land for Lease Scam is now giving a glimpse of its lawless Jungle Raj by openly declaring its intent to indulge in Land Loot Scam. RJD MLC Qari Shoaib in the presence of Tejashwi Yadav on the stage… pic.twitter.com/ALoGnVjJyQ
— C.R.Kesavan (@crkesavan) October 25, 2025
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: తెలుగులో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఐ, నోబడీ’ రిలీజ్
-
Peddi OTT : ఇట్స్ అఫిషియల్.. ఆరోజు నుంచే ఓటీటీలోకి పెద్ది
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Jagapathi Babu: మళ్లీ హీరోగా రావాలన్న ఆఫర్.. ఒక్క మాటతో షాక్ ఇచ్చిన బాబు
-
Vijayawada Road Accident: ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కొబ్బరి బొండం
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో