26/11 Mumbai Attacks: “భారతీయుల హత్యకు బాధ్యత”.. లష్కరే తోయిబాను ఉగ్రసంస్థగా ప్రకటించిన ఇజ్రాయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26/11 Mumbai Attacks: 26/11 ముంబై దాడులకు ఈ నెలతో 15 ఏళ్లు కావస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ ‘లష్కరే తోయిబా’ ఉగ్రవాదులు ముంబై నగరంపై దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే లష్కరే తోయిబాను ఇజ్రాయిల్ ఈ రోజు ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. దీనిని ఘోరమైన ఖండించదగిన సంస్థగా పేర్కొంది. భారతదేశం నుంచి ఎలాంటి అభ్యర్థన లేనప్పటికీ ఇజ్రాయిల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
‘‘ భారత ప్రభుత్వం తమను నిషేధించమని కోరనప్పటికీ.. ఇజ్రాయిల్ అధికారికంగా అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసింది. లష్కరే తోయిబాను ఇజ్రాయిల్ చట్టవిరుద్ధమైన ఉగ్రవాద సంస్థల జాబితాలో ప్రవేశపెట్టడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయి’’ అని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం తెలిపింది. ‘‘ లష్కరే తోయిబా ఒక ఘోరమైన, ఖండించదగిన ఉగ్రవాద సంస్థ, ఇది వందలాది మంది భారతీయులు పౌరులతో పాటు ఇతరుల హత్యలకు కారణమైంది. నవంబర్ 26, 2008న లష్కరే హేయమైన చర్యలు ఇప్పటికీ శాంతి కోరుకునే దేశాలు, సమాజాల ద్వారా ప్రతిధ్వనిస్తున్నాయి’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
Also Read
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
Read Also: WhatsApp: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. స్టేటస్ ఫిల్టరింగ్ ఫీచర్ బెనిఫిట్స్ ఇవే..!
ముంబై దాడుల్లో అనేక మంది విదేశీ పౌరులతో పాటు 166 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రం ద్వారా వచ్చిన ఉగ్రవాదులు ముంబై తీరానికి చేరుకుని నగరంలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, ప్రముఖ లియోపోల్డ్ కేఫ్, రెండు ఆసుపత్రులు మరియు ఒక థియేటర్తో సహా వివిధ ప్రదేశాలలో పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. నారీమన్ హౌజ్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటళ్లలో వేలాది మందిని బందీలుగా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఇజ్రాయిల్ పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఆరుగురు యూదులు ఉన్నారు. వీరంతా నారిమన్ హౌస్ లో హత్యకు గురయ్యారు.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఇండియాలో ఇజ్రాయిల్ రాయబారి నూర్ గిలోన్ మాట్లాడుతూ.. భారత్ హమాస్ని ఉగ్రసంస్థగా ప్రకటించాలని కోరారు.
తాజావార్తలు
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!