Bangladesh: బంగ్లా స్కూల్ బుక్స్ నుంచి “జాతిపిత” చరిత్ర తొలగింపు, భారత్ పాత్ర తగ్గింపు..
- చరిత్రను మారుస్తున్న బంగ్లాదేశ్..
- జాతిపిత ముజిబుర్ రెహ్మన్ చరిత్ర తొలగింపు..
- బంగ్లా పాఠ్యపుస్తకాల్లో మార్పులు..
- భారత పాత్ర తగ్గించేలా యూనస్ సర్కార్ నిర్ణయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనస్ సర్కార్ నెమ్మదిగా ఆ దేశ చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన, ఆ దేశ జాతిపితగా కీర్తించబడే షేక్ ముజిబుర్ రెహ్మన్కి సంబంధించిన చరిత్రను పాఠశాల పుస్తకాల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి అయిన ముజిబుర్ రెహ్మాన్ పాత్రను స్వాతంత్య్ర పోరాటం నుంచి తగ్గిస్తోంది. దీనికి తోడు 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి కారణమైన, బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ సహకారాన్ని కూడా తొలగిస్తోంది. బంగ్లాదేశ్లోని జాతీయ పాఠ్య ప్రణాళిక మరియు పాఠ్యపుస్తక బోర్డు (NCTB) ప్రాథమిక, మాధ్యమిక మరియు ఉన్నత మాధ్యమిక విద్యార్థులు ఉపయోగించే 441 పాఠ్యపుస్తకాలకు సవరణలు చేసింది.
ఆగస్టు 05, 2024లో పదవీచ్యుతరాలైన అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా తర్వాత పదవీ బాధ్యలు చేపట్టిన తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ అనేక సంస్కరణలకు పిలుపునిచ్చాడు. నిజానికి షేక్ ముజిబుర్ రెహ్మన్ బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించారు. అయితే, విముక్తి యుద్ధంలో పాల్గొన్న, అవామీలీగ్ని విమర్శించే నాయకులను పాఠ్యపుస్తకాల్లో చేర్చుతున్నారు. కొత్త పాఠ్యపుస్తకాల్లో ‘‘ మార్చి 26, 1971న జియావుర్ రెహమాన్ బంగ్లాదేశ్కి స్వాతంత్ర్యాన్ని ప్రకటించారని, మార్చి 27న బంగబంధు తరపున ఆయన మరో స్వాతంత్య్ర పోరాటం చేశారు’’ అని చేర్చినట్లు జాతీయ పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తక బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ ఎకేఎం రియాజుల్ హసన్ అన్నారు.
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
Read Also: DeepSeek: చైనాలో ప్రతీ ఇంట్లోకి దూరిపోతున్న ‘‘డీప్ సీక్’’..
జియావుర్ రెహమాన్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) వ్యవస్థాపకుడు. ప్రస్తుతం బీఎన్సీ చీఫ్ ఖలీదా జియా భర్త. బీఎన్సీ, ఖలిదా జియాలు పాకిస్తాన్ అనుకూలురుగా ముద్ర పడింది. అంతకుముందు, షేక్ హసీనా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, 2010 నుంచి పాఠ్యపుస్తకాల్లో ముజిబుర్ రెహ్మన్ మార్చి 26, 1971న పాకిస్తాన్ సైన్యం అరెస్ట్ చేయడానికి ముందు వైర్ లెస్ సందేశం ద్వారా స్వాతంత్య్రం ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ప్రకటన వివాదాస్పదంగా ఉంది. అవామీ లీగ్ మద్దతుదారులు ముజిబుర్ రెహ్మన్ ప్రకటన చేశారని చెబుతుంటే, లిబరేషన్ వార్లో ఆర్మీ మేజర్ అండ్ సెక్టార్ కమాండర్ అయిన జియావుర్ రెహమాన్ సూచనలతోనే ముజిబుర్ రెహ్మన్ ప్రకటన చదివారని బీఎన్పీ చెబుతోంది. ప్రస్తుతం, బంగ్లాదేశ్లో ముజిబుర్ రెహ్మాన్ చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తోంది. అవామీ లీగ్, షేక్ హసీనా ఉనికి లేకుండా చేయడానికి మహ్మద్ యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
దీనికి తోడుగా, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ముజిబుర్ రెహ్మన్ కలిసి ఉన్న ఫోటోని 6వ తరగతి ఇంగ్లీష్ పుస్తకం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. 5వ తరగతి పుస్తకం నుంచి పాకిస్తాన్ దళాలు భారత సైన్యం ముందు లొంగిపోతున్న ఫోటోని కూడా తొలగించారు. షేక్ హసీనా పాలన సమయంలో, పాఠ్యపుస్తకాల్లో హిందూత్వాన్ని వ్యాప్తి చేస్తున్నారని, బెంగాల్ ముస్లిం పాలకుల సహకారాన్ని దెబ్బతీస్తున్నారని, డార్విన్ సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా ముస్లింల మత విశ్వాసాలను అవమానిస్తున్నారని కొందరు ముస్లిం ఛాందసవాదులు విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!