Rekha Gupta: భారత్ కంటే పాకిస్థానే ప్రేమిస్తారు.. జయా బచ్చన్పై రేఖా గుప్తా ఆగ్రహం
- భారత్ కంటే పాకిస్థానే ప్రేమిస్తారు
- జయా బచ్చన్పై రేఖా గుప్తా ఆగ్రహం
సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ వర్సెస్ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కౌంటర్కు ప్రతికౌంటర్తో వాగ్యుద్ధం సాగుతోంది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో ఆపరేషన్ సిందూర్పై చర్చ నడిచింది. ఈ సందర్భంగా రాజ్యసభలో జయా బచ్చన్ మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్కు సిందూర్ అని పేరు పెట్టడాన్ని జయా బచ్చన్ తీవ్రంగా తప్పుపట్టారు. మహిళలు సిందూరాన్ని కోల్పోయి బాధలో ఉంటే.. ఆపరేషన్కు సిందూర్ అని పేరు పెట్టడమేంటి? అని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Amit Shah: అమిత్ షా సరికొత్త రికార్డ్.. దేశ చరిత్రలో ఆయనకే సొంతం
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
తాజాగా జయా బచ్చన్ రాజ్యసభలో మాట్లాడిన మాటలకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తున్నాయని.. దేశాన్ని ప్రేమించడం కంటే పాకిస్థాన్ను ప్రేమిస్తున్నారంటూ ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించారు.
ఇది కూడా చదవండి: Russia: భారీ భూకంపంతో దెబ్బతిన్న రష్యా అణు సబ్ బేస్!
సోమవారం ఢిల్లీ శాసనసభలో ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహాదేవ్పై జరిగిన చర్చ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ.. జయా బచ్చన్పై విరుచుకుపడ్డారు. ఆపరేషన్కు సిందూర్ అని ఎందుకు పేరు పెట్టారని అడిగారని.. ఆమెకు ఒక ఫిల్మీ డైలాగ్తో సమాధానం ఇస్తానన్నారు. ‘‘ఏక్ చుట్కీ సిందూర్కి కిమత్ ఆప్ క్యా జానో జయ మేడమ్? ఆప్తో ఫిల్మోంకి దున్యా జాంతి హై, దేశ్ కి సచ్చాయ్ నహీ’’ (చిటికెడు సిరప్ విలువ మీకు తెలియదు జయ మేడమ్. మీకు సినిమాల గురించి తెలుసు, దేశ వాస్తవికత గురించి కాదు.)’’ అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు భారత్ను ప్రేమించరని.. దేశ వ్యతిరేక శక్తులను ప్రేమిస్తారన్నారు. ఎందుకంటే వారు వారిలో తమ ప్రతిబింబాన్ని చూస్తారన్నారు. కాకపోతే పైకి భారతీయులం అని చెబుతారు కానీ.. మాట్లాడేటప్పుడు పాకిస్థాన్ ప్రతినిధులుగానే మాట్లాడతారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Vijay Devarakonda : కింగ్డమ్ హిట్టా.. ఫ్లాపా.. విజయ్ కోరిక తీరిందా.. లేదా?
ఆపరేషన్ సిందూర్ను ప్రపంచమంతా మెచ్చుకుంటే.. ప్రతిపక్ష నేతలు మాత్రం మోడీ విశ్వసనీయతను ప్రశ్నించారన్నారు. మన సైన్యాన్ని, మన ప్రధానమంత్రిని మాత్రం విపక్షాలు నమ్మవని ధ్వజమెత్తారు. పహల్గామ్ ఉగ్రదాడికి బదులు ప్రధాని మోడీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను రేఖా గుప్తా ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్తో తగిన బుద్ధి చెప్పినట్లు పేర్కొన్నారు. మన సోదరీమణుల గౌరవాన్ని ప్రధాని మోడీ కాపాడారన్నారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!