Regional Parties: దేశంలోని 54 ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో నంబర్-1గా జేడీయూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Regional Parties: దేశవ్యాప్తంగా ఉన్న 54 ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో నంబర్-1గా జనతాదళ్(యునైటెడ్) పార్టీ నిలిచింది. కరోనా వైరస్ విజృంభించిన కాలంలో కూడా అత్యధిక సంఖ్యలో విరాళాలను సొంతం చేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా, బీహార్లో అధికార పార్టీగా ఉన్న జేడీయూకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీకి 2020-21 ఆర్థిక సంవత్సరంలో 60.15 కోట్ల రూపాయలు డొనేషన్ల రూపంలో వచ్చాయి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన రిపోర్టులో వెల్లడించింది.
జేడీయూ తర్వాతి స్థానంలో తమిళనాడులోని రూలింగ్ పార్టీ డీఎంకే, ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిలిచాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీకి రూ.33.99 కోట్లు, ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్కి రూ.11.32 కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)కి నికరంగా రూ.4.16 కోట్ల డొనేషన్లు వచ్చాయి. తెలంగాణలోని రూలింగ్ పార్టీ టీఆర్ఎస్కి రూ.4.15 కోట్లు అందినట్లు ఏడీఆర్ పేర్కొంది. మొత్తం విరాళాల్లో సింహభాగాన్ని ఈ ఐదు రీజనల్ పార్టీలే సొంతం చేసుకోవటం విశేషం.
Also Read
- Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్లతో దీదీ విలవిల..
- DK Shivakumar: కర్ణాటక సీఎం రేసులో భారీ ట్విస్ట్.. పీసీసీ చీఫ్కు డీకే రాజీనామా..!
Basara: “బాసర” అంటే బాధ మాత్రమే కాదు. ఈ విజయగాథ కూడా..
పైగా ఈ ఐదు పార్టీల్లో ఒక్కటి (ఐయూఎంఎల్) మినహా మిగతా నాలుగూ అధికారంలోనే ఉండటం గమనార్హం. 95.45 కోట్ల రూపాయలు 207 డొనేషన్ల రూపంలో కార్పొరేట్/బిజినెస్ సెక్టార్ నుంచి అందాయి. మరో రూ.25.57 కోట్లను 2,569 మంది వ్యక్తిగత విరాళాల రూపంలో ఇచ్చారు. జేడీయూకి వచ్చిన 60.15 కోట్ల రూపాయల్లో రూ.59.24 కోట్లు 58 డొనేషన్ల రూపంలో, మిగతా రూ.90 లక్షలు 272 మంది నుంచి వ్యక్తిగత విరాళాలుగా అందాయి. ప్రతిపక్ష, ఇతర పార్టీలతో పోల్చితే అధికార పార్టీలకు ఎక్కువ విరాళాలు వచ్చాయంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఎందుకంటే రూలింగ్ పార్టీలతో, వాటి ప్రభావం కొద్దోగొప్పో ఉండే ప్రభుత్వ అధికారులతో ఆయా వ్యక్తులకు లేదా కార్పొరేట్/బిజినెస్ సెక్టార్కి చాలా పనులు ఉంటాయి. గవర్నమెంట్ కాంట్రాక్టులు, వివిధ ప్రాజెక్టులు, కొత్త వ్యాపారాలకు అనుమతులు.. ఇలా పలు సందర్భాల్లో ఇరు వర్గాల మధ్య కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఇది అధికార పార్టీలకు కలిసొస్తుంది. దీన్నే గిట్టనివాళ్లు క్విడ్-ప్రొ-కొ (నీకిది-నాకది) అని విమర్శిస్తూ ఉంటారు. ఇక జాతీయ పార్టీల విషయానికొస్తే కేంద్రంలో గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి అత్యధికంగా డొనేషన్లు రావటం తెలిసిందే.
తాజావార్తలు
-
బండోడి ట్యూన్కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
-
IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
-
Big Alert : ఇంటర్ సిలబస్లో కీలక మార్పులు.. కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
-
Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్తో ఇలా చెక్ చేయండి
-
Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!