IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!
- జింబాబ్వే పర్యటన కోసం భారత టీ20 జట్టు ప్రకటన
- మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్
- ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Squad Selection Debate: జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో కొన్ని ఎంపికలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున రాణించిన కొందరు ఆటగాళ్లకు అవకాశం రాకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ఐపీఎల్లో పెద్దగా రాణించని ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టులో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్కు చోటు దక్కలేదు. పాటిదార్ 2026 ఐపీఎల్ సీజన్లో 501 పరుగులు చేశాడు. అతను 41.75 బ్యాటింగ్ సగటు, 192.69 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. అలాగే టోర్నమెంట్లో 42 సిక్సర్లు బాదాడు. సీనియర్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా, యువ పేసర్ రసిఖ్ సలామ్లకు కూడా ఛాన్స్ రాలేదు. కృనాల్ 45.0 సగటుతో 226 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు పడగొట్టాడు. రసిఖ్ 12 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. 21.32 సగటు, 9.46 ఎకానమీ రేటుతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా జింబాబ్వే సిరీస్కు ఎంపిక కాకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
- Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
- Horror Spell: టీమిండియా స్టార్ పేసర్ను పొట్టుపొట్టు కొట్టిన లోకల్ ప్లేయర్స్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే!
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
మరోవైపు ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్కు భారత జట్టులో అవకాశం లభించింది. ఐపీఎల్ 2026లో అతను ఆశించిన స్థాయిలో రాణించలేదు. లక్నో సూపర్ జెయింట్స్ తరపున 4 మ్యాచ్లలో ఆడినప్పటికీ.. ఒక్క వికెట్ పడగొట్టలేదు. సుమారు 12 ఎకానమీ రేట్తో పరుగులు సమర్పించుకున్నప్పటికీ జట్టులో చోటు దక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో పలువురు అభిమానులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆర్సీబీ ఆటగాళ్లను బీసీసీఐ పక్కన పెడుతోంది అని అంటున్నారు. మయాంక్ యాదవ్కు ఏ ప్రాతిపదికన చోటు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!