Bengal Re-Polling: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రీ – పోలింగ్.. 697 కేంద్రాల్లో నేడు నిర్వహణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Re-Polling: ఎన్నికలు జరిగిన తరువాత ఒకటి, రెండు రోజుల్లో కొన్ని చోట్ల రీపోలింగ్ జరగడం సర్వసాధారణం. అలాగే పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో భారీ హింస చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లోని 697 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. నేడు ఉదయం 7 గంటల నుంచి రీపోలింగ్ను నిర్వహించనున్నారు. పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో శనివారం పోలింగ్ జరిగిన విషయం తెలిసింది. పోలింగ్ రోజున భారీగా కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ భారీ హింస జరిగింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు, బ్యాలెట్ పేపర్లు తగలబెట్టడాలు, దొంగ ఓట్లు, పోలింగ్ బాక్సులు ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు జరిగాయి. ఇక పోలింగ్ రోజున జరిగిన హింసలో ప్రభుత్వ లెక్కల ప్రకారం వివిధ పార్టీలకు చెందిన 15 మంది మరణించారు. అయితే అనధికారికంగా 18 మంది మృతిచెందినట్టు చెబుతున్నారు. హింసాత్మక ఘటనలు జరిగిన 19 జిల్లాల్లోని 697 పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు రీ పోలింగ్ నిర్వహించనుంది. ఈ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.
Read also: UP: అత్త స్నోకింగ్ స్టైల్.. భార్య కిస్సింగ్ స్టైల్ చూసి బిత్తరపోయిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
రీపోలింగ్లో అత్యధికంగా ముర్షిదాబాద్లోని 175 బూత్లలో రీపోలింగ్ నిర్వహించనుండగా, మాల్డాలో 110, నాడియాలో 89, కూచ్ బేహార్లో 53, ఉత్తర 24 పరగణాలులో 46, ఉత్తర దినాజ్పూర్లో 42, దక్షిణ 24 పరగణాలలో 36, పూర్వ మేదినీపూర్లో 31, హుగ్లీలో 29, దక్షిణ్ దినాజ్పూర్లో 18, జల్పాయ్గురిలో 14, బీర్భూమ్లో 14, పశ్చిమ మేదినీపూర్లో 10, బంకురా, హౌరాల్లో 8 చొప్పున, పశ్చిమ బర్ధమాన్లో 6, పురూలియాలో 4, పూర్వ బర్ధమాన్లో 3, అలీపుర్దువార్లోని ఒక పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ జరుగనుంది. కొండప్రాంతాలైన డార్జిలింగ్, జార్గ్రామ్, కాలింపాంగ్ జిల్లాల్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగియడంతో అక్కడ పోలింగ్ను నిర్వహించడం లేదు. ఎన్నికల ఫలితాలు జూలై 11న వెలువడనున్నాయి. తాజా ఘర్షణల నేపథ్యంలో ఫలితాలు 11న వెలువడినప్పటికీ మరో 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర భద్రత బలగాలను మోహరించాలని కోల్కతా హైకోర్టు ఈ నెల 6న ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 20 వరకు కేంద్ర బలగాలు పశ్చిమ బెంగాల్లో కొనసాగనున్నాయి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!