Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
- రాంచీ ఆర్ఎస్ఎస్ కార్యాలయం దాడి కేసు..
- నిందితుల్లో ఒకరు తప్పించుకునే ప్రయత్నం..
- పోలీసుల ఎన్కౌంటర్లో గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranchi RSS attack: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇటీవల ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరు పోలీస్ కస్టడీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, జరిగిన ఎన్కౌంటర్లో గాయాపాలయ్యాడు. ఈ కేసులో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో భద్రతా సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
నిందితుడు సైఫ్ అన్సారీ అలియాస్ రోహిత్ అనే నిందితుడు కోత్వాలి పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉండగా బాత్రూమ్ వెళ్తానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఎన్కౌంటర్ చేశారు. ఈ క్రమంలో సైఫ్ గాలికీ బుల్లెట్ గాయమైంది. వెంటనే అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. జూన్ 16న రాత్రి రాంచీలోని చుటియా ప్రాంతంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై సైఫ్ అన్సారీతో పాటు అమన్ అన్సారీ, సయామ్ సుజన్ అనే నిందితులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో అమన్ అన్సారీ ప్రధాన సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
ముగ్గురు నిందితులు జార్ఖండ్కు చెందిన వారే అని గుర్తించారు. ఇందులో ఒకరు రాంచీకి చెందిన వాడు కాగా, మరో ఇద్దరు లోహార్దగా జిల్లాకు చెందినవారు. సోషల్ మీడియా ద్వారా ప్రభావితమై ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దాడికి ముందు కార్యాలయం ముందు రెక్కీ నిర్వహించి, వీడియో చిత్రీకరించినట్లు తెలిసింది. నిందితులుకు పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు గ్యాంగ్స్టర్ షెహజాద్ భట్టి నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయా.? అనే కోణంలో విచారణ జరుగుతోంది. నిందిుతల్లో ఒకడు ఆరు నెలలు దుబాయ్లో ఉన్నట్లు, అక్కడే అనుమాని నెట్వర్క్తో పరిచయమైనట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. రానా సాహిబ్ అనే వ్యక్తి పెట్రోల్ బాంబుల తయారీ చేసే వీడియోలు పంపినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..