Ram Mohan Naidu: ఇండిగో తీరుపై కేంద్రమంత్రి సీరియస్.. చర్యలు ఉంటాయని వార్నింగ్
- ఇండిగో తీరుపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్
- చర్యలు ఉంటాయని వార్నింగ్
- రేపటి నుంచి సమస్యలు ఉండకూదని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండిగో ఎయిర్లైన్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. మంచి ఫీక్ సమయం చూసుకుని దెబ్బకొట్టింది. సహజంగా డిసెంబర్లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఎవరి మీదో కోపం.. ప్రయాణికులపై చూపించినట్లైంది. అకస్మాత్తుగా వందలాది విమాన సర్వీసులను రద్దు చేసేసి ఏమి తెలియనట్లుగా సైలెంట్గా ఉంది. ‘ఎవరేమైపోతే నాకేంటి?’ అన్నట్లుగా ఇండిగో వ్యవహారించింది. ఓ వైపు బుకింగ్లు చేస్తూనే.. ఇంకోవైపు ప్రయాణికులను విమానాశ్రయాలకు రప్పించి చివరి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్లు చావు కబురు చెప్పి విచిత్రంగా వ్యవహారించింది. పాపం.. ఇండిగో ఎత్తుగడ ఎరగని ప్రయాణికులు మాత్రం చేసేదేమీ లేక విమానాశ్రయాల్లోనే చలిలో బిక్కుబిక్కుమంటూ మూడు రోజులు కాలం వెళ్లదీశారు. ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం. తిండి తిప్పలు లేక ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు కాశారు.
ఇది కూడా చదవండి: Indian Railways: విమాన ప్రయాణికుల కష్టాలకు రైల్వే శాఖ చెక్.. ప్రత్యేక ట్రైన్ సర్వీసులు ఏర్పాటు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ఇండిగో సృష్టించిన సంక్షోభంపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సంక్షోభం సృష్టించిన ఇండిగోపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేపటి నుంచి ప్రయాణికులకు సమస్యలు సృష్టించడం ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: పుతిన్ విందుకు రాహుల్, ఖర్గేలకు ఆహ్వానం లేదు.. శశి థరూర్కి మాత్రం స్పెషల్ ఇన్విటేషన్..
నవంబర్ 1 నుంచి కొత్త విమాన డ్యూటీ నిబంధనలు అమల్లోకి వచ్చినా.. మిగతా విమానయాన సంస్థలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదని.. అలాంటిది ఇండిగోకే ఎందుకు ఎదురవుతాయని ప్రశ్నించారు. అంటే ఇది ఇండిగో సృష్టించిన సంక్షోభం అని స్పష్టం చేశారు. పరిస్థితులు మెరుగుపడతాయని.. రేపటి నుంచి కార్యకలాపాలు పున:ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల్ని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండిగో అంతరాయాలను విచారించడానికి, తప్పు చేసిన వ్యక్తులను గుర్తించడానికి ఒక కమిటీ వేస్తామని వెల్లడించారు. అనంతరం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం FDTL మార్గదర్శకాలు ప్రధాన కారణమని చెబుతున్నారని.. కానీ ఇతర విమానయాన సంస్థలు కూడా (నిబంధనలు) పాటిస్తున్నాయని.. వారికి ఎటువంటి సమస్య లేదని రామ్మోహన్ నాయుడు అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..