Rameshwaram Cafe blast: ఉగ్రవాదుల టార్గెట్ కేఫ్ కాదు.. ఎన్ఐఏ ఛార్జిషీట్లో సంచలన విషయాలు
- ఉగ్రవాదుల టార్గెట్ రామేశ్వరం కేఫ్ కాదు
- ఎన్ఐఏ ఛార్జిషీట్లో సంచలన విషయాలు
- 2024.. మార్చి 1న రామేశ్వరం కేఫ్లో బాంబు దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు ఘటనపై ఎన్ఐఏ ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదుల తొలి టార్గెట్ బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని పేల్చడమేనని వెల్లడించింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం రోజే బీజేపీ కార్యాలయాన్ని ఐఈడీతో పేల్చేందుకు విఫలయత్నం చేసినట్లు తెలిపింది. అది విఫలం అవ్వడంతోనే రామేశ్వరం కేఫ్ పేలుడుకు ఫ్లాన్ చేసినట్లు వెల్లడించింది. బెంగళూరు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించిన ఛార్జిషీటులో ఈ విషయాలను స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Air Force Helicopter: సాంకేతిక లోపంతో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ చెన్నై సమీపంలో అత్యవసర ల్యాండింగ్
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఈ కేసులో నలుగురు నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మథీన్ అహ్మద్ తాహా, మాజ్ మునీర్ అహ్మద్, ముజామ్మిల్ షరీఫ్లను నిందితులుగా చేర్చింది. వీరిలో షాజీబ్, తాహాలు ఐసిస్ రాడికల్స్ అని తెలిపింది. ఈ దాడుల కోసం డార్క్ వెబ్ నుంచి డౌన్లోడ్ చేసిన భారత్, బంగ్లాదేశ్ గుర్తింపు కార్డులను ఉపయోగించినట్లు గుర్తించింది. ఈ నలుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
2024, మార్చి 1న రామేశ్వరం కేఫ్లో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. మార్చి 3న ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ.. వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఏజెన్సీల సమన్వయంతో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించింది. ఇందుకోసం పలు సాంకేతిక, క్షేత్రస్థాయి పరిశోధనలు సైతం నిర్వహించింది. షాజీబ్ అనే నిందితుడు బాంబును అమర్చాడని విచారణలో తేలింది. రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటన జరిగి 42 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్లో దాక్కున్న నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
ఇది కూడా చదవండి: Minister Kollu Ravindra: సహాయక చర్యల్లో గాయపడిన కానిస్టేబుల్కు రూ.2 లక్షల ఆర్థిక సాయం
తాహా మరియు షాజిబ్లకు క్రిప్టో కరెన్సీల ద్వారా హ్యాండ్లర్ నిధులు సమకూర్చారని పేర్కొంది. బెంగళూరులో వివిధ హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు నిందితులు ఈ నిధులను వినియోగించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం రోజున బెంగళూరులోని మల్లేశ్వరంలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం దగ్గర విఫలమైన ఐఈడీ దాడి.. ఆ తర్వాత ఇద్దరు కీలక నిందితులు రామేశ్వరం కేఫ్ పేలుడుకు ప్లాన్ చేశారని ప్రకటన పేర్కొంది.
ఇది కూడా చదవండి: Indonesia: ఇండోనేషియాలో విమానం ప్రమాదం.. రన్వే నుంచి జారిపడ్డ ఫ్లైట్
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!