Ramdas Athawale: శివసేనలో చీలికకు సంజయ్ రౌత్ కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramdas Athawale: పార్టీ చీలికకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కారణమని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆరోపించారు. రౌత్ కోరిక మేరకు ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. శివసేనను విచ్ఛిన్నం చేసింది శరద్ పవార్ కాదని, సంజయ్ రౌత్ కోరిక మేరకు ఉద్ధవ్ ఠాక్రే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో వెళ్లాలని నిర్ణయించుకున్నారని ఆయన వెల్లడించారు. శివసేన, ఎన్సీపీ కలిసి ఉండకపోతే మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వాలు వచ్చి ఉండేవని కేంద్ర మంత్రి అన్నారు.
శివసేన, ఎన్సీపీ కలిసి ఉండకపోతే మహా వికాస్ అఘాడీ ఎప్పటికీ ఏర్పడి ఉండేది కాదని, అందువల్ల మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పడేదని అథవాలే అన్నారు.అంతకుముందు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శివసేనను విచ్ఛిన్నం చేశారని, పవార్ పార్టీని క్రమపద్ధతిలో బలహీనపరిచారని మహారాష్ట్ర మాజీ మంత్రి రాందాస్ కదమ్ ఆరోపించారు.శివసేన అధినేత కుమారుడు ఎన్సీపీ, కాంగ్రెస్ మంత్రులతో కూర్చోవడం మాకెవరికీ ఆమోదయోగ్యం కాదని, ఏక్నాథ్ షిండే ఈ చర్య తీసుకోకుంటే సేనకు 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండేవారు కాదని రాందాస్ అథవాలే అన్నారు. 52 ఏళ్లు పార్టీలో పనిచేసి తనను చివరకు పదవి నుంచి తొలగించారని.. ఏకనాథ్ షిండేకు తోడుగా నిలిచిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతానని చెప్పారు.
Also Read
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
Govt Jobs: 9.79లక్షల ఉద్యోగాలు ఖాళీ.. పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
దీనిపై అథవాలే స్పందిస్తూ.. శివసేన ఎన్సీపీతో కలిసి వెళ్లినప్పుడు.. ఇది బాలాసాహెబ్ ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయానికి విరుద్ధమని తాను చెప్పినట్లు అథవాలే తెలిపారు. ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రే మొదట్లో బీజేపీతో కలిసి వచ్చినట్లయితే ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఉండేవారని అన్నారు. ఏ ప్రతిష్టంభన ఉండేది కాదని రాందాస్ అథవాలే స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!