Rajnath Singh: ఎలాంటి అతిక్రమణలనైనా ఎదుర్కొనే సత్తా భారత్ సైన్యానికి ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh Talks About India China Clash At Tawang In Parliament: ఈనెల 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అంశంపై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంట్లో మాట్లాడారు. తవాంగ్లోని యాంగ్త్సే ప్రాంతంలో పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని అన్నారు. అయితే.. వారిని మన రక్షణ దళాలు ధీటుగా తిప్పికొట్టాయని, ఈ ఘర్షణలో మన భారతీయ సైనికులెవరూ తీవ్రంగా గాయపడలేదని చెప్పారు. ఎటువంటి అతిక్రమణలనైనా ధీటుగా ఎదుర్కొనే సత్తా భారత్ సైన్యానికి ఉందని, చైనా దళాల ప్రయత్నాన్ని మన సైన్యం దృఢ సంకల్పంతో ఎదురించాయని పేర్కొన్నారు. మన దేశ భూభాగంలోకి చొరబడకుండా వాళ్లని నిలువరించారన్నారు.
Akhilesh Yadav: 2024లోగా బీజేపీకి ప్రత్యామ్నాయం.. ఆ దిశగా కేసీఆర్ కృషి
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారని.. భారత సైన్యంతో పోలిస్తే, చైనా సైనికులే ఎక్కువమంది గాయపడ్డారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారతీయ సైనికుల్లో ఏ ఒక్కరూ కూడా తీవ్రంగా గాయపడటం గానీ, ప్రాణాలు కోల్పోవడం గానీ జరగలేదని స్పష్టం చేశారు. ఇండియన్ మిలిటరీ కమాండర్స్ సకాలంలో జోక్యం చేసుకుని.. పీఎల్ఏ సైనికులు మన దేశ భూభాగంలోకి చొరబడకుండా, తిరిగి వెళ్ళిపోయేలా చేశారన్నారు. దేశ సరిహద్దులను కాపాడేందుకు మన భారత సైన్యం నిబద్ధతతో కట్టుబడి ఉందని.. ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయన్నారు. చైనా సైనికులు ఘర్షణకు దిగడం గురించి.. చైనా వద్ద దౌత్య మార్గాల్లో ప్రస్తావించినట్లు తెలిపారు. మరోవైపు.. ఈ దాడిలో చైనా సైనికులు స్పైక్డ్ క్లబ్స్, పెద్ద కర్రలతో భారత సైనికులపై ఎగబడ్డారని.. అందుకు భారత సైనికులు ధీటుగానే బదులిచ్చారని భారత సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులు స్పల్పంగా గాయపడగా.. గాయపడ్డ భారత సైనికుల్ని గువాహటిలోని బసిష్టలో ఉన్న 151 బేస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించామని తెలిపింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!