Rajnath Singh: ఎలాంటి అతిక్రమణలనైనా ఎదుర్కొనే సత్తా భారత్ సైన్యానికి ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh Talks About India China Clash At Tawang In Parliament: ఈనెల 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అంశంపై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంట్లో మాట్లాడారు. తవాంగ్లోని యాంగ్త్సే ప్రాంతంలో పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని అన్నారు. అయితే.. వారిని మన రక్షణ దళాలు ధీటుగా తిప్పికొట్టాయని, ఈ ఘర్షణలో మన భారతీయ సైనికులెవరూ తీవ్రంగా గాయపడలేదని చెప్పారు. ఎటువంటి అతిక్రమణలనైనా ధీటుగా ఎదుర్కొనే సత్తా భారత్ సైన్యానికి ఉందని, చైనా దళాల ప్రయత్నాన్ని మన సైన్యం దృఢ సంకల్పంతో ఎదురించాయని పేర్కొన్నారు. మన దేశ భూభాగంలోకి చొరబడకుండా వాళ్లని నిలువరించారన్నారు.
Akhilesh Yadav: 2024లోగా బీజేపీకి ప్రత్యామ్నాయం.. ఆ దిశగా కేసీఆర్ కృషి
Also Read
ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారని.. భారత సైన్యంతో పోలిస్తే, చైనా సైనికులే ఎక్కువమంది గాయపడ్డారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారతీయ సైనికుల్లో ఏ ఒక్కరూ కూడా తీవ్రంగా గాయపడటం గానీ, ప్రాణాలు కోల్పోవడం గానీ జరగలేదని స్పష్టం చేశారు. ఇండియన్ మిలిటరీ కమాండర్స్ సకాలంలో జోక్యం చేసుకుని.. పీఎల్ఏ సైనికులు మన దేశ భూభాగంలోకి చొరబడకుండా, తిరిగి వెళ్ళిపోయేలా చేశారన్నారు. దేశ సరిహద్దులను కాపాడేందుకు మన భారత సైన్యం నిబద్ధతతో కట్టుబడి ఉందని.. ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయన్నారు. చైనా సైనికులు ఘర్షణకు దిగడం గురించి.. చైనా వద్ద దౌత్య మార్గాల్లో ప్రస్తావించినట్లు తెలిపారు. మరోవైపు.. ఈ దాడిలో చైనా సైనికులు స్పైక్డ్ క్లబ్స్, పెద్ద కర్రలతో భారత సైనికులపై ఎగబడ్డారని.. అందుకు భారత సైనికులు ధీటుగానే బదులిచ్చారని భారత సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులు స్పల్పంగా గాయపడగా.. గాయపడ్డ భారత సైనికుల్ని గువాహటిలోని బసిష్టలో ఉన్న 151 బేస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించామని తెలిపింది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!