Akhilesh Yadav: 2024లోగా బీజేపీకి ప్రత్యామ్నాయం.. ఆ దిశగా కేసీఆర్ కృషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav Talks About Alternative Alliance Against BJP: ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి 2024లోగా ‘ప్రత్యామ్నాయం’ ఏర్పాటు చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఇందుకోసం కేసీఆర్, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకున్నందు వల్ల ప్రత్యామ్నాయం అవసరం ఉందని, నిరుద్యోగం కూడా పెరుగుతోందని తెలిపారు. భారతీయులందరికీ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులు సైతం హరించబడుతున్నాయని విమర్శించారు. ఢిల్లీలో ఈనెల 14వ తేదీన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Lokesh Kanagaraj: ‘రోలెక్స్’ పాత్ర కోసం సెపరేట్ సినిమానే ఉంటుంది…
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
కాగా.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్, అఖిలేష్ యాదవ్ ఇప్పటికే పలుమార్లు సమావేశం అయ్యారు. బీజేపీకి వ్యతిరేక కూటమిపై చర్చించారు. ఇప్పుడు బీఆర్ఎస్కి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం లభించడంతో.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. కలిసొచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ.. ఆయా రాష్ట్రాల్లో పోలీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే తాము కర్ణాటకలో జేడీఎస్తో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే! అఖిలేశ్ యాదవ్ కూడా కేసీఆర్తో కలిసి నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే.. కాంగ్రెస్కి కూడా బీఆర్ఎస్ ప్రత్యామ్నాయమని కేసీఆర్ చెప్తుండగా, అఖిలేశ్ మాత్రం కాంగ్రెస్ని వ్యతిరేకించడం లేదు. ఆయన భార్య డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్లోని మైన్పురి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పాదాలకు నమస్కారం చేయడం గమనార్హం.
Parliament Winter Session: చైనా-భారత్ ఘర్షణ.. లోక్సభలో చర్చకు కాంగ్రెస్ డిమాండ్
ఇదిలావుండగా.. దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం చేపట్టారు. రేపు (బుధవారం) నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఢిల్లీ వెళ్లారు. వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ మద్దతుదారులు తరలివచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!