Rajnath Singh: డబుల్ ఇంజిన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.. బెంగాల్లో రాజ్నాథ్సింగ్ ప్రచారం
- డబుల్ ఇంజిన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
- మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించిన పార్టీలకు బుద్ధి చెప్పంది
- బెంగాల్లో రాజ్నాథ్సింగ్ ఎన్నికల ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబుల్ ఇంజిన్తోనే బెంగాల్ అభివృద్ధి సాధ్యమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో రాజ్నాథ్సింగ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. రేపటితో తొలి విడత పోలింగ్కు ప్రచారం ముగియనుంది. దీంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు.
ఇది కూడా చదవండి: Flight: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు.. వీడియో వైరల్
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ… ‘‘పశ్చిమ బెంగాల్ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్కు వరుసగా మూడు అవకాశాలు ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి 15 ఏళ్లు తక్కువ సమయం కాదని నేను భావిస్తున్నాను. దేశంలో కేవలం ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల కాలంలోనే రాష్ట్రాలను వేగంగా అభివృద్ధి చేసుకున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు పశ్చిమ బెంగాల్ అందించే వాటా.. గతంలో 10 శాతం ఉండేది. టీఎంసీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 శాతానికి పడిపోయింది. బెంగాల్ ప్రజలు భయం, తీవ్రవాద వాతావరణంలో జీవితాలను గడుపుతున్నారు. ఈసారి మార్పు తప్పక రావాలి. ఇక్కడి తల్లులకు, సోదరీమణులకు నేను భరోసా ఇస్తున్నాను. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయండి. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి ప్రధాని మోడీ పూర్తిగా కట్టుబడి ఉన్నారు. ఈ రోజు కాకపోయినా.. రేపైనా సరే అది తప్పక జరుగుతుంది.’’ అని రాజ్నాథ్సింగ్ భరోసా ఇచ్చారు.
‘‘ఎన్ని సీట్లు గెలుస్తామన్నది నేను కచ్చితంగా అంచనా వేయలేను. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. బీజేపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుంది. బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీని గెలుచుకుంటుంది. టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ… ఈ పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించాయి. మహిళలకు రిజర్వేషన్ను వ్యతిరేకించిన ఆ రాజకీయ పార్టీలకు మహిళలే తగిన గుణపాఠం నేర్పిస్తారు.’’ అని అన్నారు.
బెంగాల్లో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 23 కాగా, రెండో విడత ఏప్రిల్ 29న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.
#WATCH | Birbhum, West Bengal: Defence Minister Rajnath Singh says, "…The people of West Bengal gave the TMC three consecutive chances. I believe 15 years is not a short time for a state's development. There are many states in the country that have rapidly developed their… pic.twitter.com/GRkpGCPYPP
— ANI (@ANI) April 20, 2026
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!