Flight: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు.. వీడియో వైరల్
- విమాన ప్రయాణికులకు నరకం
- గాల్లో ఉండగా విమానంలో కుదుపులు
- వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమాన ప్రయాణం అంటే ఎవరికైనా సరదానే. కానీ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదురైతే ఎలా ఉంటుంది. కళ్ల ముందు చావు భీతి కనిపిస్తుంది. అచ్చం అలాంటి భయమే ఎదురైంది. విమానంలో గాల్లో ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా కుదుపులు ఏర్పడడంతో బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు అరుపులు, కేకలతో వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన IC3401 విమానం హైదరాబాద్ నుంచి హుబ్లీకి వెళ్తోంది. హుబ్లీకి దగ్గర పడుతున్న సమయంలో ఒక్కసారిగా విమానంలో సంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా విమానం అదుపు తప్పింది. గగనతలంలో ఉండగా కుదుపులు ఏర్పడ్డాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు హడలెత్తిపోయారు. కొందరు గట్టిగా సీట్లను పట్టుకోగా.. మరికొందరు కేకలు వేశారు. ఇంకొందరు ఏడ్చేశారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వణికిపోయారు. కొందరి ప్రయాణికుల్లో చావు ముఖం కనిపించింది. మొత్తానికి 4 గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టాక.. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో బతుకు జీవుడా అంటూ గుండెలు అరచేతిలో పెట్టుకుని కిందకు దిగి ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- TVK Government Formation: తమిళనాడు కోటపై టీవీకే జెండా.. లెఫ్ట్ పార్టీలు, వీసీకే అండతో సీఎం పీఠంపై విజయ్!
- Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్ది నీచ రాజకీయం’’.. విజయ్తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..
- Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?
- Kalahandi Issues: డిజిటల్ ఇండియాలో 'మంచమే' అంబులెన్స్.. గర్భిణిని కిలోమీటరు మోసుకెళ్లిన గ్రామస్థులు!
అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా దిగేశారు. కానీ ప్రయాణికుల్లో మాత్రం తీవ్ర భయాందోళనలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
నివేదికల ప్రకారం… ఫ్లై91 ఎయిర్లైన్స్ విమానం ఆదివారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఇది సాయంత్రం 4:30 గంటలకు హుబ్బళ్లిలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, విమానం హుబ్బళ్లిని సమీపిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు ల్యాండింగ్ ప్రణాళికను మార్చుకోవలసి వచ్చింది.

విమానం ముండ్గోడ్, దావణగెరె, శివమొగ్గ వంటి ప్రాంతాలపై దాదాపు నాలుగు గంటల పాటు చక్కర్లు కొడుతూ గాలిలోనే ఉంది. ఈ సమయంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దించేశారు. ఆ సమయంలో విమానంలోని ప్రయాణికుల ఉద్రిక్త పరిస్థితులను కొందరు మొబైల్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా ప్రయాణికుల బంధువులు.. ఫ్లై91 ఎయిర్లైన్స్పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం లేదా అప్డేట్లు ఇవ్వలేదని.. సమాచార లోపం, నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.
#Breaking 🚨: Passengers #Panic in #Hubballi bound flight #Fly91 after technical glitch forces it to circle for hours, #flight landed safely in #Bengaluru, #Kempegowda International #Airport#FlightEmergency #AviationNews #FlightSafety #IndiaNews #EmergencyLanding
#turbulence pic.twitter.com/cZJJhkURED— Jiten Ahuja 🇮🇳 🕊️ 🚩 (@AhujaJiten) April 20, 2026
తాజావార్తలు
-
TVK Government Formation: తమిళనాడు కోటపై టీవీకే జెండా.. లెఫ్ట్ పార్టీలు, వీసీకే అండతో సీఎం పీఠంపై విజయ్!
-
Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్ది నీచ రాజకీయం’’.. విజయ్తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..
-
Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?
-
Kalahandi Issues: డిజిటల్ ఇండియాలో ‘మంచమే’ అంబులెన్స్.. గర్భిణిని కిలోమీటరు మోసుకెళ్లిన గ్రామస్థులు!
-
Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీలు..?