Rajiv Gandhi assassination: “మా నాన్నను ఎందుకు చంపారు”.. ప్రియాంకాగాంధీ ఏడ్చారన్న నళిని
Rajiv Gandhi assassination case: సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు తమిళనాడు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు మరో ఐదుగురు వెల్లూరు, మధురై జైళ్ల నుంచి విడుదల అయ్యారు. ఆదివారం నిందితుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు తనకు సహాయపడిన వారందరికి థాంక్స్ చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో ప్రియాంకా గాంధీ వాద్రా కలిసిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తనను జైలులో కలిశారని.. నా తండ్రిని ఎందుకు చంపారని ప్రశ్నించారని నళిని తెలిపారు. జైలులో కలిసిన సమయంలో నన్ను కలిసిన సమయంలో భావోద్వేగంతో ఏడ్చేశారని వెల్లడించారు. రాజీవ్ గాంధీ హత్య గురించి తనను ప్రియాంకాగాంధీ ప్రశ్నించినట్లుగా తెలిపారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉంటే.. ఈ ఏడాది మేలో ఏజీ పెరివాలన్ ను సుప్రీంకోర్టు తన విస్తృత అధికారాలను ఉపయోగించి విడుదల చేసింది. తాజాగా ఇదే సూత్రాన్ని మిగతా ఆరుగురు నిందితులకు వర్తింప చేస్తూ 30 ఏళ్ల తరువాత ఈ కేసు నుంచి ఆరుగురికి విముక్తిని ప్రసాదించింది.
Also Read
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
- Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Read Also: Gold Smuggling: ముంబై విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం.. బెల్టులో అమర్చి తరలించే యత్నం
నిందితుల్లో నళిని భర్త శ్రీహరన్ కూడా ఉన్నారు. ఆయన శ్రీలంక జాతీయుడు కావడంతో తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరంలో ఉంచారు. త్వరలోనే తన భర్తను కలుస్తున్నట్లు నళిని వెల్లడించారు. తమిళనాడులోని పలు ప్రదేశాలకు వెళ్లాలని తాను అనుకుంటున్నట్లు నళిని వెల్లడించారు. ఈ కేసులో తనకు సహకరించిన అందర్ని కలవాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు గాంధీ కుటుంబీకులను కలవాలనుకుంటున్నట్లు తెలిపారు.
జైలులో ఉన్న సమయంలో మమ్మల్ని మరణశిక్ష ఖైదీలుగా చూసేవరాని.. తాను అరెస్ట్ అయ్యే సమయానికి గర్భవతిని అయినప్పటికీ..జైలులో బంధించారని నళిని అన్నారు. నా జీవితం ఇప్పటికే నాశనం అయిందని..కుటుంబమే తనకు మొదటి ప్రాధాన్యత అని ఆమె తెలిపారు. నేను నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ కేసులో నళినితో పాటు రవిచంద్రన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, ఎస్ రాజా, శ్రీహరన్ దోషులుగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ పర్యటనకు రాజీవ్ గాంధీ వచ్చిన సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టిటిఇ) గ్రూప్కి చెందిన మహిళా ఆత్మాహుతి బాంబర్ ఆయన్ను హత్య చేసింది.
తాజావార్తలు
-
FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
-
Boyapati : ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బోయపాటికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని స్టార్స్
-
Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
-
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!