Rajiv Gandhi assassination: “మా నాన్నను ఎందుకు చంపారు”.. ప్రియాంకాగాంధీ ఏడ్చారన్న నళిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajiv Gandhi assassination case: సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు తమిళనాడు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు మరో ఐదుగురు వెల్లూరు, మధురై జైళ్ల నుంచి విడుదల అయ్యారు. ఆదివారం నిందితుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు తనకు సహాయపడిన వారందరికి థాంక్స్ చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో ప్రియాంకా గాంధీ వాద్రా కలిసిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తనను జైలులో కలిశారని.. నా తండ్రిని ఎందుకు చంపారని ప్రశ్నించారని నళిని తెలిపారు. జైలులో కలిసిన సమయంలో నన్ను కలిసిన సమయంలో భావోద్వేగంతో ఏడ్చేశారని వెల్లడించారు. రాజీవ్ గాంధీ హత్య గురించి తనను ప్రియాంకాగాంధీ ప్రశ్నించినట్లుగా తెలిపారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉంటే.. ఈ ఏడాది మేలో ఏజీ పెరివాలన్ ను సుప్రీంకోర్టు తన విస్తృత అధికారాలను ఉపయోగించి విడుదల చేసింది. తాజాగా ఇదే సూత్రాన్ని మిగతా ఆరుగురు నిందితులకు వర్తింప చేస్తూ 30 ఏళ్ల తరువాత ఈ కేసు నుంచి ఆరుగురికి విముక్తిని ప్రసాదించింది.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
Read Also: Gold Smuggling: ముంబై విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం.. బెల్టులో అమర్చి తరలించే యత్నం
నిందితుల్లో నళిని భర్త శ్రీహరన్ కూడా ఉన్నారు. ఆయన శ్రీలంక జాతీయుడు కావడంతో తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరంలో ఉంచారు. త్వరలోనే తన భర్తను కలుస్తున్నట్లు నళిని వెల్లడించారు. తమిళనాడులోని పలు ప్రదేశాలకు వెళ్లాలని తాను అనుకుంటున్నట్లు నళిని వెల్లడించారు. ఈ కేసులో తనకు సహకరించిన అందర్ని కలవాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు గాంధీ కుటుంబీకులను కలవాలనుకుంటున్నట్లు తెలిపారు.
జైలులో ఉన్న సమయంలో మమ్మల్ని మరణశిక్ష ఖైదీలుగా చూసేవరాని.. తాను అరెస్ట్ అయ్యే సమయానికి గర్భవతిని అయినప్పటికీ..జైలులో బంధించారని నళిని అన్నారు. నా జీవితం ఇప్పటికే నాశనం అయిందని..కుటుంబమే తనకు మొదటి ప్రాధాన్యత అని ఆమె తెలిపారు. నేను నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ కేసులో నళినితో పాటు రవిచంద్రన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, ఎస్ రాజా, శ్రీహరన్ దోషులుగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ పర్యటనకు రాజీవ్ గాంధీ వచ్చిన సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టిటిఇ) గ్రూప్కి చెందిన మహిళా ఆత్మాహుతి బాంబర్ ఆయన్ను హత్య చేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!