Rajasthan: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఉదయ్ పూర్ హత్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్తాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్ లో జరిగిన హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మహ్మద్ ప్రవక్తను అవమానపరిచిన నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కన్హయ్య లాల్ అనే టైలర్ ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేయడం, హత్యను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం, అది వైరల్ కావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయ్ పూర్ లో మల్దాస్ ప్రాంతంలో బిజీగా ఉండే మార్కెట్ లో తన షాప్ లో పని చేసుకుంటున్న కన్హయ్య కుమార్ ను రియాజ్ అక్తర్ పదునైన ఆయుధంతో గొంతు కోయడంతో పాటు శిరచ్ఛేదానికి ప్రయత్నించారు. మరో నిందితుడు గౌస్ మహ్మద్ ఈ హత్యను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని హెచ్చరించడం కలకలం రేపుతోంది. ఘటనకు పాల్పడిన నిందితులను గంటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ హత్యతో రాజస్తాన్ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజస్తాన్ లో మంగళవారం ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేశారు. అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. నెల రోజుల పాటు ఈ సెక్షన్ ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. దీనిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కారణంగా పోలీసులకు సెలవులు రద్దు చేశారు. అన్ని జిల్లాల్లో , సున్నిత ప్రాంతాల్లో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఉదయ్ పూర్ లో కర్ఫ్యూ విధించారు పోలీసులు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఇదిలా ఉంటే ఘటనను జమియత్ ఉలామా- ఇ- హింద్ సంస్థ ఉదయ్ పూర్ హత్యను ఖండించింది. హత్య ఇస్లాం, దేశ చట్టాలకు వ్యతిరేఖమని సంస్థ కార్యదర్శి మౌలానా హకీముద్దీన్ ఖాస్మీ అన్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిని సమర్థించలేమని, ఇది ఇస్లాం మతానికి విరుద్ధమని పేర్కొన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని.. దేశంలో శాంతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!