Rajasthan: క్రేజీ దొంగలు.. ఎమ్మెల్యే కారునే చోరీ చేశారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA’s car was stolen in Rajasthan: రాజస్థాన్ లో ఓ ఎమ్మెల్యే కారు చోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజధాని జైపూర్ ను దిగ్భంధం చేసి వెతికినా కారు ఆచూకీ కనుక్కోలేకపోయారు పోలీసులు. ఈ ఘటనపై రాజస్థాన్ పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) ఎమ్మెల్యే నారాయణ్ బెనివాల్కు చెందిన స్కార్పియో కారు చోరీకి గురైంది. నారాయణ బెనివాల్ వివాక్ విహార్ శ్యామ్ నగర్ లో నివసిస్తున్నాడు. ఎప్పటి లాగేనే ప్లాట్ ముందు తన కార్ ను పార్క్ చేశాడు. ఉదయం లేచి చూడగానే తన కారు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఎమ్మెల్యే బేణివాల్ డ్రైవర్ జగదీష్ శ్యామ్ నగర్ పోలీస్ స్టేషన్ లో దొంగతనంపై ఫిర్యాదు చేశాడు. కానీ ఎమ్మెల్యే కారు కోసం పోలీసులు ఎంత వెతికినా కనుక్కోలేకపోయారు. ఈ విషయంపై జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ కూడా రంగంలోకి దిగారు. అయినా ఇప్పటి వరకు కారు జాడను, దొంగల జాడను కనుక్కోలేకపోయారు.
ఈ ఘటనపై పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యే బెనివాల్ . రాష్ట్రంలో దొంగలకు పోలీసులు అంటే భయం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే వాహనం ఇలా చోరీకి గురైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. పోలీసులు అడ్డాలు పెట్టి సామాన్యుడిని తనిఖీల పేరుతో ఇబ్బందులుకు గురి చేస్తున్నారని.. దొంగలు, నేరస్తులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు. నారాయణ్ బెనివాల్ , నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనివాల్ కు స్వయానా సోదరుడు.
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
Read Also: Singapore Open: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం
ఈ ఘటనపై విచారణ జరుగుపుతున్నట్లు ఎస్హెచ్వో శ్రీమోహన్ మీనా తెలిపారు. శనివారం రాత్రి 11 గంటల వరకు ఎమ్మెల్యే వాహనం ఇంటి బయటే ఉందని.. ఉదయం 7 గంటలకు బాల్కనీ నుంచి బయటకు వచ్చి చూస్తే కనిపించలేదని అధికారి వెల్లడించారు. జైపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని రహదారుల్లో పోలీసులు బందోబస్త్ పెట్టారు. ఘటనాస్థలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిందితుల ఆచూకీ కోసం వెతుకుతున్నారు. అయితే ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం అశోక్ గెహ్లాట్ ను టార్గెట్ చేశాయి.
తాజావార్తలు
-
Indian Origin Cricketer: ఆ క్రికెటర్కు బిగ్షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
-
TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
-
E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
-
Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
-
Sukumar – DSP: దేవిశ్రీ ప్రసాద్ – సుకుమార్ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!