రాజస్థాన్ లో ఓ ఎమ్మెల్యే కారు చోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజధాని జైపూర్ ను దిగ్భంధం చేసి వెతికినా కారు ఆచూకీ కనుక్కోలేకపోయారు పోలీసులు. ఈ ఘటనపై రాజస్థాన్ పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) ఎమ్మెల్యే నారాయణ్ బెనివాల్కు చెందిన స్కార్పియో కారు చోరీకి గురైంది. నారాయణ బేణీవాల్ వివాక్ విహార్ శ్యామ్ నగర్ లో నివసిస్తున్నాడు.