Rajasthan: బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన 9 జిల్లాలు రద్దు
- రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
- కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన 9 జిల్లాలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం శనివారం అశోక్ గెహ్లాట్ పదవీకాలంలో ఏర్పాటైన తొమ్మిది జిల్లాలు, మూడు డివిజన్లను రద్దు చేసింది. రద్దు చేయబడిన డివిజన్లలో పాలి, సికార్, బన్స్వారా డివిజన్లు ఉన్నాయి. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన దూడు, కేక్రి, నీమ్కథానా, గంగాపూర్ సిటీ, జైపూర్ రూరల్, జోధ్పూర్ రూరల్, అనుప్గఢ్, సాంచోర్, షాపురా జిల్లాలను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో ఇప్పుడు 41 జిల్లాలు మరియు 7 డివిజన్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Pawankalyan OG: పవన్ కళ్యాణ్ “ఓజీ” సినిమాపై డీవీవీ మూవీస్ కీలక ప్రకటన..
Also Read
- Kargil Vijay Diwas 2026: కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ..
- Abhijeet Dipke: "ఇది అంతం కాదు.. ఆరంభం".. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
- SBI Manager Slapped: ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ను చెంపదెబ్బ కొట్టిన మాజీ కేంద్ర మంత్రి కుమార్తె.. వీడియో
- Amit Shah: పదవి కంటే దేశం, విద్యార్థులే ముఖ్యమని మరోసారి నిరూపించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
శనివారం కేబినెట్ సమావేశంలో జిల్లాల రద్దు నిర్ణయం తీసుకున్నారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 17 జిల్లాలు ఏర్పాటు చేసింది. ఇందులో తొమ్మిది జిల్లాలను తాజాగా బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. తాజా నిర్ణయంతో 41 జిల్లాలు, ఏడు డివిజన్లు మిగిలి ఉన్నాయి. కేబినెట్ నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రులు సుమిత్ గోదారా, జోగారామ్ పటేల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డుడు, కేక్రీ, షాపురా, నీమ్కథానా, గంగాపూర్ సిటీ, జైపూర్ రూరల్, జోధ్పూర్ రూరల్, అనుప్గఢ్, సంచోర్ జిల్లాలను రద్దు చేసినట్లు తెలిపారు. బలోత్రా, ఖైర్తాల్-తిజారా, బీవార్, కోట్పుట్లీ-బహరోడ్, దిద్వానా-కుచమన్, ఫలోడి, డీగ్, సన్లుబర్ జిల్లాలు యథాతథంగా ఉంటాయని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తన పదవీకాలం చివరి దశలో 17 జిల్లాలు మరియు మూడు డివిజన్లను ఏర్పాటు చేసింది. ప్రజల సౌకర్యార్థం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక పని చేసిందని, రాజకీయ పక్షపాతంతో భజన్ లాల్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని కాంగ్రెస్ తప్పుపట్టింది.
ఇది కూడా చదవండి: Ladakh: లడఖ్లో ఎత్తైన శివాజీ విగ్రహం ఆవిష్కరణ
తాజావార్తలు
-
BTech Fees 2026: ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీటెక్ కనీస వార్షిక ఫీజు రూ.47 వేలు!
-
Debt Trap: అప్పు తీర్చడానికి మరో అప్పు.. EMI ట్రాప్లో మిడిల్క్లాస్ ఎలా చిక్కుకుంటోంది?
-
Explainer: రాత్రికి రాత్రే దాడి.. కంట్రోల్ తప్పిన ఏఐ..దెబ్బకు కథ అడ్డం తిరిగింది!
-
Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
-
Ferty9: అంతర్జాతీయ పరిశోధనల్లో విశేష గుర్తింపు.. ప్రపంచ వేదికపై తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా ‘ఫెర్టీ9’!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!