Farmer: రైతు ఖాతాలోకి పొరపాటున రూ. 16 లక్షలు.. తిరిగిచ్చేందుకు నిరాకరణ..
- రైతు ఖాతాలోకి పొరపాటున రూ. 16 లక్షలు..
- 10 రోజుల తర్వాత తప్పును గుర్తించిన బ్యాంక్..
- అప్పటికే రూ. 15 లక్షలు వాడుకున్న రైతు..
- చివరు పోలీస్ స్టేషన్ చేరిన పంచాయతీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmer: రాజస్థాన్ అజ్మీర్ జిల్లాకు చెందిన ఓ రైతు బ్యాంక్ ఖాతాలో పొరపాటున రూ. 16 లక్షలు వచ్చాయి. అయితే, వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు సదరు రైతు ససేమిరా ఒప్పుకోలేదు. చివరకు బ్యాంక్ పోలీసులను ఆశ్రయించింది. కిషన్గఢ్లోని అర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. చోటా లాంబా గ్రామానికి చెందిన రైతు కనరామ్ జాట్ తన ఖాతాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లక్షల్లో డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. దీంతో ఆనందంతో సదరు రైతు, పర్సనల్ లోన్ తీర్చేందుకు రూ. 15 లక్షలు వాడుకున్నాడు.
న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి పంట బీమా ప్రీమియంగా ఈ మొత్తాన్ని, పొరపాటున రైతు జాట్ ఖతాలోకి బదిలీ చేసినట్లు బ్యాంక్ కనుగొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజన్ జితేంద్ర ఠాకూర్ మంగళవారం సాయంత్రం అరణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న రైతు ఖాతాలోకి డబ్బులు చేరాయి. జనవరి 2 నుంచి 4 మధ్య జాట్ ఒక్కొక్కటిగా రూ. 5 లక్షల చొప్పున వేర్వేరు లావాదేవీలు చేశాడు. మొత్తం 15 లక్షలను వినియోగించుకున్నాడని బ్యాంక్ మేనేజర్ జితేంద్ర ఠాకూర్ వెల్లడించారు.
Also Read
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
Read Also: Team India: బీజీటీలో అతను ఆడకపోయి ఉంటే మేము గెలిచే వాళ్లం.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు
అయితే, తప్పు జరిగిన పదిరోజుల తర్వాత అంటే జనవరి 10న బ్యాంక్ యాజమాన్యం తాము చేసిన తప్పును గుర్తించింది. ఈలోపే రైతు ఖర్చు చేశాడు. దీంతో బ్యాంక్ తమ డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా కోరితే, అతను ఇచ్చేందుకు నిరాకరించాడని ఠాకూర్ తెలిపారు. తన రుణాన్ని చెల్లించడానికి డబ్బును వినియోగించుకున్నట్లు రైతు తెలిపారు.
ప్రస్తుతం ఈ డబ్బుని తిరిగి పొందేందుకు బ్యాంక్ చట్టపరమైన మార్గాలనున అణ్వేషిస్తోంది. కనారామ్ జాట్ కిసాన్ క్రెడిట్ కార్డ్, 10 ఎకరాల భూమి పత్రాలు బ్యాంక్ వద్ద ఉన్నాయని ఠాకూర్ చెప్పారు. అతను డబ్బు తిరిగి ఇవ్వకపోతే, అతడి భూమిని వేలం వేయడం ద్వారా రూ. 16 లక్షలు తిరిగి పొందాల్సి వస్తుందని చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని పోలీస్ అధికారి రాం స్వరూప్ జాట్ చెప్పారు.
తాజావార్తలు
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!