Farmer: రైతు ఖాతాలోకి పొరపాటున రూ. 16 లక్షలు.. తిరిగిచ్చేందుకు నిరాకరణ..
- రైతు ఖాతాలోకి పొరపాటున రూ. 16 లక్షలు..
- 10 రోజుల తర్వాత తప్పును గుర్తించిన బ్యాంక్..
- అప్పటికే రూ. 15 లక్షలు వాడుకున్న రైతు..
- చివరు పోలీస్ స్టేషన్ చేరిన పంచాయతీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmer: రాజస్థాన్ అజ్మీర్ జిల్లాకు చెందిన ఓ రైతు బ్యాంక్ ఖాతాలో పొరపాటున రూ. 16 లక్షలు వచ్చాయి. అయితే, వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు సదరు రైతు ససేమిరా ఒప్పుకోలేదు. చివరకు బ్యాంక్ పోలీసులను ఆశ్రయించింది. కిషన్గఢ్లోని అర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. చోటా లాంబా గ్రామానికి చెందిన రైతు కనరామ్ జాట్ తన ఖాతాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లక్షల్లో డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. దీంతో ఆనందంతో సదరు రైతు, పర్సనల్ లోన్ తీర్చేందుకు రూ. 15 లక్షలు వాడుకున్నాడు.
న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి పంట బీమా ప్రీమియంగా ఈ మొత్తాన్ని, పొరపాటున రైతు జాట్ ఖతాలోకి బదిలీ చేసినట్లు బ్యాంక్ కనుగొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజన్ జితేంద్ర ఠాకూర్ మంగళవారం సాయంత్రం అరణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న రైతు ఖాతాలోకి డబ్బులు చేరాయి. జనవరి 2 నుంచి 4 మధ్య జాట్ ఒక్కొక్కటిగా రూ. 5 లక్షల చొప్పున వేర్వేరు లావాదేవీలు చేశాడు. మొత్తం 15 లక్షలను వినియోగించుకున్నాడని బ్యాంక్ మేనేజర్ జితేంద్ర ఠాకూర్ వెల్లడించారు.
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
Read Also: Team India: బీజీటీలో అతను ఆడకపోయి ఉంటే మేము గెలిచే వాళ్లం.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు
అయితే, తప్పు జరిగిన పదిరోజుల తర్వాత అంటే జనవరి 10న బ్యాంక్ యాజమాన్యం తాము చేసిన తప్పును గుర్తించింది. ఈలోపే రైతు ఖర్చు చేశాడు. దీంతో బ్యాంక్ తమ డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా కోరితే, అతను ఇచ్చేందుకు నిరాకరించాడని ఠాకూర్ తెలిపారు. తన రుణాన్ని చెల్లించడానికి డబ్బును వినియోగించుకున్నట్లు రైతు తెలిపారు.
ప్రస్తుతం ఈ డబ్బుని తిరిగి పొందేందుకు బ్యాంక్ చట్టపరమైన మార్గాలనున అణ్వేషిస్తోంది. కనారామ్ జాట్ కిసాన్ క్రెడిట్ కార్డ్, 10 ఎకరాల భూమి పత్రాలు బ్యాంక్ వద్ద ఉన్నాయని ఠాకూర్ చెప్పారు. అతను డబ్బు తిరిగి ఇవ్వకపోతే, అతడి భూమిని వేలం వేయడం ద్వారా రూ. 16 లక్షలు తిరిగి పొందాల్సి వస్తుందని చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని పోలీస్ అధికారి రాం స్వరూప్ జాట్ చెప్పారు.
తాజావార్తలు
-
KS Bharat Retirement: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్..
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..