Indian Railways: రైల్వేలో సిబ్బంది కొరత.. రిటైర్డ్ ఉద్యోగులకు లక్కీ ఛాన్స్!
- రైల్వేలో సిబ్బంది కొరత
- రిటైర్డ్ ఉద్యోగులకు లక్కీ ఛాన్స్!
- దరఖాస్తు చేసుకోవాలని బోర్డు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ రైల్వేలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. చాలా రోజులుగా రిక్రూట్మెంట్ లేకపోవడంతో కొంది మందితోనే రైల్వేశాఖ నడిపించేస్తోంది. దీంతో ఎంప్లాయిస్ పని భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు జోన్లలో 25 వేల ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రారంభించింది. అయితే కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా.. రిటైర్డ్ ఉద్యోగులకు ఛాన్స్ ఇచ్చింది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Zubeida: షాకింగ్ : దెయ్యంలా మారిన బాలీవుడ్ నటి?
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
సూపర్వైజర్ల నుంచి ట్రాక్మెన్ వరకు పలు ఉద్యోగాలకు రైల్వే నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే 65 ఏళ్ల లోపు వారు మాత్రమే ఇందుకు అర్హులని చెప్పినట్లు సమాచారం. రెండేళ్ల పదవీకాలానికి గాను వీరిని నియమించుకోనున్నారు. అవసరమైతే పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జోనల్ రైల్వే జనరల్ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులు గత ఐదేళ్ల మెడికల్ ఫిట్నెస్తో పాటు, పదవీ విరమణకు ముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు వారి పనితీరును పరిశీలించి ఈ నియామకాలు చేపట్టనున్నారు. గతంలో విజిలెన్స్, లేదా డిపార్ట్మెంట్ చర్యలను ఎదుర్కొన్న వారు దరఖాస్తులకు అనర్హులని తేల్చినట్లు సమాచారం.
సిబ్బంది కొరతతో పాటు గత కొంతకాలంగా రైలు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్క వాయవ్య రైల్వే జోన్లోనే 10వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. మిగతా జోన్లలోనూ పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం ఉందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఎల్జీ ఆమోదం..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!