Pamban Rail Bridge: సముద్ర బ్రిడ్జిపై హై-స్పీడ్ ట్రయల్ రన్ విజయవంతం
- భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ మరో అద్భుతం
- రామేశ్వరం వెళ్లే హైస్పీడ్ రైలు ట్రయల్ రన్ విజయవంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే వ్యవస్థ మరో అద్భుతం సృష్టించింది. రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే కొత్త పంబన్ వంతెన భారీ స్థాయిలో పూర్తయింది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో రూ.550 కోట్లతో నిర్మించారు. నవంబర్ 13, 14 తేదీల్లో తనిఖీలు నిర్వహించామని రైల్వే సేఫ్టీ కమిషనర్ (సౌత్ జోన్) ఏఎం చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వంతెనపై వివిధ ప్రాంతాల్లో నడిచి, నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం బ్రిడ్జి మధ్యలో ఉన్న లిఫ్టింగ్ సిస్టమ్ను, మండపం నుంచి రామేశ్వరం వెళ్లే హైస్పీడ్ రైలు ట్రయల్ రన్ను పరిశీలించారు.
ఇది కూడా చదవండి: Congress: హామీలతో ఆర్థిక సమస్యలు.. ‘‘గ్రీన్ సెస్’’ విధించే దిశగా కర్ణాటక సర్కార్..
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
మదురై డీఆర్ఎం శరత్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ‘‘కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి పునాది నిర్మాణాన్ని పరిశీలించాం.. అలాగే లిఫ్టింగ్ సిస్టమ్కు సంబంధించిన ఆపరేషనల్ టెస్ట్ కూడా నిర్వహించాం.. ఇప్పటికే ఉన్న అన్ని ఫీచర్లను క్షుణ్ణంగా పరిశీలించాం.. అదే విధంగా టెస్ట్ రన్ కూడా నిర్వహించాం. మండపం నుంచి రామేశ్వరం వరకు 90 కి.మీ వేగంతో 15 నిమిషాలు పట్టింది. ప్రస్తుతం వదిలివేయబడిన పాత రైల్వే వంతెన శిథిలావస్థకు చేరుకుంది జాతీయ స్మారక చిహ్నంగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంటాం.’’ అని వెల్లడించారు.
‘‘సముద్రంలో 333 కాంక్రీట్ పునాదులు మరియు 101 కాంక్రీట్ స్తంభాలు నిర్మించబడ్డాయి. భవిష్యత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని డబుల్ ట్రాక్కు అనుగుణంగా పునాది మరియు పైర్లను విస్తరించారు. అయితే ప్రస్తుత డిమాండ్ను పరిగణనలోకి తీసుకొని ఒకే రైలు మార్గాన్ని నిర్మించారు.’’ అని రైల్వే అధికారి తెలిపారు.
Shri A.M. Chowdhary, Commissioner of Railway Safety, Southern Circle, Bengaluru conducted a high-speed trial between Pamban and Mandapam, marking a milestone as this engineering marvel, the New Pamban Bridge, nears commissioning #SouthernRailway pic.twitter.com/AXA8y20lTy
— Southern Railway (@GMSRailway) November 14, 2024
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!