Pamban Rail Bridge: సముద్ర బ్రిడ్జిపై హై-స్పీడ్ ట్రయల్ రన్ విజయవంతం
- భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ మరో అద్భుతం
- రామేశ్వరం వెళ్లే హైస్పీడ్ రైలు ట్రయల్ రన్ విజయవంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే వ్యవస్థ మరో అద్భుతం సృష్టించింది. రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే కొత్త పంబన్ వంతెన భారీ స్థాయిలో పూర్తయింది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో రూ.550 కోట్లతో నిర్మించారు. నవంబర్ 13, 14 తేదీల్లో తనిఖీలు నిర్వహించామని రైల్వే సేఫ్టీ కమిషనర్ (సౌత్ జోన్) ఏఎం చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వంతెనపై వివిధ ప్రాంతాల్లో నడిచి, నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం బ్రిడ్జి మధ్యలో ఉన్న లిఫ్టింగ్ సిస్టమ్ను, మండపం నుంచి రామేశ్వరం వెళ్లే హైస్పీడ్ రైలు ట్రయల్ రన్ను పరిశీలించారు.
ఇది కూడా చదవండి: Congress: హామీలతో ఆర్థిక సమస్యలు.. ‘‘గ్రీన్ సెస్’’ విధించే దిశగా కర్ణాటక సర్కార్..
Also Read
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి 'ది ఎండ్'?
- Punjab Blasts: పంజాబ్లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!
- Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
మదురై డీఆర్ఎం శరత్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ‘‘కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి పునాది నిర్మాణాన్ని పరిశీలించాం.. అలాగే లిఫ్టింగ్ సిస్టమ్కు సంబంధించిన ఆపరేషనల్ టెస్ట్ కూడా నిర్వహించాం.. ఇప్పటికే ఉన్న అన్ని ఫీచర్లను క్షుణ్ణంగా పరిశీలించాం.. అదే విధంగా టెస్ట్ రన్ కూడా నిర్వహించాం. మండపం నుంచి రామేశ్వరం వరకు 90 కి.మీ వేగంతో 15 నిమిషాలు పట్టింది. ప్రస్తుతం వదిలివేయబడిన పాత రైల్వే వంతెన శిథిలావస్థకు చేరుకుంది జాతీయ స్మారక చిహ్నంగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంటాం.’’ అని వెల్లడించారు.
‘‘సముద్రంలో 333 కాంక్రీట్ పునాదులు మరియు 101 కాంక్రీట్ స్తంభాలు నిర్మించబడ్డాయి. భవిష్యత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని డబుల్ ట్రాక్కు అనుగుణంగా పునాది మరియు పైర్లను విస్తరించారు. అయితే ప్రస్తుత డిమాండ్ను పరిగణనలోకి తీసుకొని ఒకే రైలు మార్గాన్ని నిర్మించారు.’’ అని రైల్వే అధికారి తెలిపారు.
Shri A.M. Chowdhary, Commissioner of Railway Safety, Southern Circle, Bengaluru conducted a high-speed trial between Pamban and Mandapam, marking a milestone as this engineering marvel, the New Pamban Bridge, nears commissioning #SouthernRailway pic.twitter.com/AXA8y20lTy
— Southern Railway (@GMSRailway) November 14, 2024
తాజావార్తలు
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
-
Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
-
Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
-
Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!