NIA Raids: టెర్రర్ గ్రూపులతో లింకున్న గ్యాంగ్స్టర్ల అణచివేత.. భారీస్థాయిలో ఎన్ఐఏ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA Raids: పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన నెల రోజుల అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్ఐఏ గ్యాంగ్స్టర్లపై దాడులు చేసింది. ఉగ్రవాద గ్రూపులతో లింకు ఉన్న గ్యాంగ్స్టర్లపై దాడులు చేస్తోంది. ఉత్తర భారతదేశంలోని 60 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని వివిధ గ్యాంగ్స్టర్లతో సంబంధం ఉన్న ప్రదేశాల్లో దాడులు జరిగాయి. కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్తో పాటు జగ్గు భగవాన్పురియా హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో స్థానిక పోలీసు బలగాల సమన్వయంతో దాడులు నిర్వహిస్తున్నారు.
ఇటీవల జరిగిన కొన్ని ఉగ్రవాద కేసుల దర్యాప్తులో గ్యాంగ్స్టర్లు, టెర్రరిస్టుల మధ్య బంధం ఉన్నట్లు తేలడంతో ఈ గ్యాంగ్స్టర్లు యాంటీ టెర్రర్ ఏజెన్సీ రాడార్పైకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. సిద్ధూ మూసేవాలా హత్యకేసులో ప్రధాన నిందితుడు లారెన్స్ బిష్ణోయ్ సహా కొందరు గ్యాంగ్స్టర్లు కూడా జైళ్ల నుంచే పనిచేస్తున్నారని వారు తెలిపారు.ఈ గ్యాంగ్స్టర్లకు వ్యతిరేకంగా భారతదేశం అంతటా నిఘా-నేతృత్వంలో సమన్వయంతో కూడిన కార్యకలాపాలు నిర్వహించాలని, వారి అంతర్జాతీయ సంబంధాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏను కోరిందని పలు వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Meenakshi Natarajan: "మేము జోక్యం చేసుకోలేం".. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
- Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
Shepherd Donates Land: ఊరి దాహం తీర్చేందుకు గొర్రెల కాపరి భూరి విరాళం
లారెన్స్ బిష్ణోయ్, బంబిహా, నీరజ్ బవానా గ్యాంగ్లకు చెందిన 10 మందిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులను ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన నిందితులకు, ఉగ్ర గ్రూపులకు మధ్య బలమైన సంబంధాలున్నాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఇంతకు ముందే వెల్లడించారు. వీరి బంధాన్ని ఐఎస్ఐ ఉపయోగించుకుంటోందని చెప్పారు. ఈ క్రమంలోనే దేశీయంగా, అంతర్జాతీయంగా జైళ్లలో ఉండి కార్యకలాపాలు సాగిస్తోన్న వారిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం ఎన్ఐఏ ఈ దాడులు నిర్వహిస్తోంది. ఎన్ఐఏ గురిలో గోల్డీ బ్రార్ కూడా ఉన్నాడు. నీరజ్ బవానా, అతడి గ్యాంగ్ ప్రముఖ వ్యక్తులే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతోన్నట్లు, సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నీరజ్ గ్యాంగ్కు, లారెన్స్ బిష్ణోయ్కు మధ్య విభేదాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాద కేసుల్లో ప్రమేయం ఉన్న గ్యాంగ్స్టర్లను అరెస్టు చేయడానికి ఈ దాడులు నిర్వహించబడ్డాయి. సీమాంతర ఆయుధాల స్మగ్లింగ్లో పాల్గొన్న వారిపై కూడా దాడులు జరిగాయి.
సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత ఉగ్రవాదులు, పంజాబ్కు చెందిన గ్యాంగ్స్టర్ల మధ్య పెరుగుతున్న అనుబంధం దృష్టికి వచ్చింది. రాష్ట్ర ఆధారిత గ్యాంగ్స్టర్ల నెట్వర్క్పై గత రెండు నెలలుగా కేంద్రం పంజాబ్ పోలీసులకు పలు హెచ్చరికలు పంపిందని అధికారులు తెలిపారు. జూన్ 29న పంజాబ్లోని మాన్సా జిల్లాలోని మూసా గ్రామం సమీపంలో గాయకుడు తన వాహనంలో కాల్చి చంపబడ్డాడు.
తాజావార్తలు
-
China Robot: చైనా రోబోలు.. భారత్కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
-
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!