Site icon NTV Telugu

Lok sabha Video: పార్లమెంట్ దగ్గర ఆసక్తికర సన్నివేశం.. రాహుల్‌గాంధీ రాగానే కేంద్రమంత్రులు ఏం చేశారంటే..!

Rahulgandhi

Rahulgandhi

పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కేంద్రమంత్రులు మీడియాతో మాట్లాడుతుండగా సడన్‌గా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారు. అంతే అక్కడ నుంచి కేంద్రమంత్రులు జంప్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

బుధవారం బడ్జెట్‌పై రాహుల్ గాంధీ మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. అవసరానికి తగ్గట్టుగా కేటాయింపులు జరగలేదని ఆరోపించారు. అంతేకాకుండా భారత్-అమెరికా డీల్‌ను తప్పుపట్టారు. ఈ వాణిజ్య ఒప్పందం సిగ్గుచేటు అని.. దేశాన్ని అమ్మేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అయితే ఇదే విషయంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అని పార్లమెంట్ ఎదుట మీడియా ముందు కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, అశ్విని వైష్ణవ్ చెబుతుండగా.. హఠాత్తుగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు. అంతే అక్కడ నుంచి కేంద్రమంత్రులు వెళ్లిపోయారు. అప్పటికీ కలిసి మాట్లాడదాం అంటూ రాహుల్ గాంధీ పిలిచినా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

‘‘లేదు.. నా దగ్గర డేటా ఉంది. హర్దీప్ పూరి, అనిల్ అంబానీ పేర్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేర్లు ఉన్నాయి. ప్రధానమంత్రిపై ప్రత్యక్ష ఒత్తిడి ఉంది. ఒత్తిడి లేకుండా ఏ ప్రధానమంత్రి దీన్ని చేయరు (అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం). రైతుల విషయంలో జరిగింది. డేటా, ఇంధన భద్రతతో ఏ ప్రధానమంత్రి కూడా సాధారణ పరిస్థితిలో ఇలా చేయరు.’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

 

Exit mobile version