Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు మరోసారి ఈడీ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతల విచారణ సాగుతోంది. సోమవారం రోజు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. అయితే మంగళవారం ( జూన్14)న కూడా విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. దీంతో రాహుల్ గాంధీని నేడు కూడా విచారించనుంది ఈడీ. సోమవారం విచారణకు హాజరైన రాహుల్ గాంధీని ఈడీ దాదాపుగా 10 గంటల పాటు విచారించింది. సోమవారం ఉదయం ప్రారంభం అయిన విచారణ రాత్రి 11.10 గంటలకు ముగిసింది.
ఇటీవల నేషనల్ హెరాల్డ్ లో ఆర్థిక అవకతవకలపై ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ముందుగా జూన్ 2న విచారణకు హాజరుకావాలని రాహుల్ గాంధీని కోరినప్పటికీ.. ఆయన విదేశాల్లో ఉండటంతో జూన్ 13న హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. మరోవైపు సోనియాను జూన్ 8న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.. అయితే కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీని జూన్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు. ఈ కేసులో ఇంతకుముందే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే, పవన్ బన్సల్ ను విచారించింది ఈడీ.
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
ఇదిలా ఉంటే సోమవారం రాహుల్ గాంధీని ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగ కాంగ్రెస్ నేతలు ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీతో పాటు రాష్ట్రాల రాజధానుల్లో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఢిల్లీలో నిరసన తెలిపారు. ఈడీ సమన్లకు వ్యతిరేఖంగా సత్యాగ్రహ యాత్రలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీని అణచివేసేందుకు బీజేపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని అణచివేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ చట్టానికి అతీతుడు కాదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతికి మద్దతు ఇస్తున్నారని బీజేపీ విమర్శించింది.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!