Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు మరోసారి ఈడీ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతల విచారణ సాగుతోంది. సోమవారం రోజు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. అయితే మంగళవారం ( జూన్14)న కూడా విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. దీంతో రాహుల్ గాంధీని నేడు కూడా విచారించనుంది ఈడీ. సోమవారం విచారణకు హాజరైన రాహుల్ గాంధీని ఈడీ దాదాపుగా 10 గంటల పాటు విచారించింది. సోమవారం ఉదయం ప్రారంభం అయిన విచారణ రాత్రి 11.10 గంటలకు ముగిసింది.
ఇటీవల నేషనల్ హెరాల్డ్ లో ఆర్థిక అవకతవకలపై ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ముందుగా జూన్ 2న విచారణకు హాజరుకావాలని రాహుల్ గాంధీని కోరినప్పటికీ.. ఆయన విదేశాల్లో ఉండటంతో జూన్ 13న హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. మరోవైపు సోనియాను జూన్ 8న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.. అయితే కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీని జూన్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు. ఈ కేసులో ఇంతకుముందే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే, పవన్ బన్సల్ ను విచారించింది ఈడీ.
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
- Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్కు తిరుగులేదు..
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
ఇదిలా ఉంటే సోమవారం రాహుల్ గాంధీని ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగ కాంగ్రెస్ నేతలు ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీతో పాటు రాష్ట్రాల రాజధానుల్లో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఢిల్లీలో నిరసన తెలిపారు. ఈడీ సమన్లకు వ్యతిరేఖంగా సత్యాగ్రహ యాత్రలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీని అణచివేసేందుకు బీజేపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని అణచివేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ చట్టానికి అతీతుడు కాదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతికి మద్దతు ఇస్తున్నారని బీజేపీ విమర్శించింది.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?