Rahul Gandhi: బీజేపీ ఎంపీలలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఓట్ చోరీతో గెలిచారు.. రాహుల్ గాంధీ విమర్శలు
- బీజేపీపై రాహుల్ గాంధీ మరోసారి ఫైర్
- ‘ఓట్ల దొంగతనం’ ఆరోపణలు
- లోక్సభలో 240 బీజేపీ ఎంపీలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఓట్ల దొంగతనం” ఆరోపణలను పునరుద్ఘాటిస్తూ సోషల్ మీడియాలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల దొంగతనం వల్ల కొన్నిసార్లు సీట్లు మాత్రమే కాదు, మొత్తం ప్రభుత్వాలే కూలిపోతాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన పోస్టులో గణాంకాలను ప్రస్తావిస్తూ, లోక్సభలోని 240 మంది బీజేపీ ఎంపీలలో సుమారు ఆరుగురిలో ఒకరు ఓట్ల దొంగతనం ద్వారా గెలిచారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ సొంత పరిభాషలోనే వారిని “చొరబాటుదారులు” అని పిలవాలా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
ఓటర్ల జాబితాపై ఆరోపణలు
Also Read
- Shashi Tharoor: ప్రధాని మోడీ, అమిత్ షా ఎన్నికల వ్యూహం భేష్.. మనం నేర్చుకోవాలి.. కాంగ్రెస్కు థరూర్ సలహా
- West Bengal New Assembly: పశ్చిమ బెంగాల్ కొత్త శాసనసభ ఏర్పాటుకు మార్గం సుగమం.. ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన జారీ
- Vijay TVK Government: టీవీకే విజయ్కి కాంగ్రెస్ షరతులు.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు!
- Kalita Majhi: ఇళ్లలో పనిమనిషి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన కలితా మాజీ.. ఈమె ఎవరు?
రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని సంస్థలు అధికార పార్టీ ప్రభావంలో పనిచేస్తూ, ఎన్నికల వ్యవస్థను రిమోట్ కంట్రోల్ చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. “వారి అసలు భయం సత్యం పట్లే. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే, ఈరోజు వారు 140 స్థానాలకు దగ్గరగా కూడా గెలవలేరు” అని రాహుల్ అన్నారు.
హర్యానా ప్రభుత్వంపై విమర్శలు
హర్యానా ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ, అక్కడి మొత్తం ప్రభుత్వమే ఒక “చొరబాటుదారు”లా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఓట్ల దొంగతనం, ఎన్నికల అక్రమాల కారణంగానే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘంపై విమర్శలు
ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, ఓటర్ల జాబితాలపై పూర్తి స్థాయి పరిశీలన జరగాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ నుంచి దీనిపై ఎలాంటి ప్రతిస్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
- Tags
- bjp
- BJP MPs
- rahul gandhi
- Vote Theft
తాజావార్తలు
-
Rahul Gandhi: బీజేపీ ఎంపీలలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఓట్ చోరీతో గెలిచారు.. రాహుల్ గాంధీ విమర్శలు
-
Shashi Tharoor: ప్రధాని మోడీ, అమిత్ షా ఎన్నికల వ్యూహం భేష్.. మనం నేర్చుకోవాలి.. కాంగ్రెస్కు థరూర్ సలహా
-
Rajinikanth: రజినీ – కమల్ మల్టీస్టారర్ బడ్జెట్ ఎంతో తెలుసా? రెమ్యునరేషన్లకే సగం ఖర్చు!
-
West Bengal New Assembly: పశ్చిమ బెంగాల్ కొత్త శాసనసభ ఏర్పాటుకు మార్గం సుగమం.. ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన జారీ
-
Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం.. ఈదురుగాలులకు ముగ్గురు రైతుల మృతి..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!